సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక అమాంతం పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బిజినెస్ వర్గాల్లో మాత్రం క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అన్ని ఏరియాల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని సితార టీమ్ నుంచి వినిపిస్తున్న టాక్. మార్చి 29 అంతా సానుకూలంగానే కనిపిస్తోంది కానీ ఒక గండం మాత్రం కవ్విస్తోంది. అదే రోజు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ – ది న్యూ ఎంపైర్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. తెలుగు డబ్బింగ్ తో సహా అన్ని వెర్షన్లు సమాంతరంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒక లోకల్ తెలుగు సినిమాకు దానికి సంబంధం ఏంటని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే గాడ్జిల్లా కాంగ్ కున్న క్రేజ్ దృష్ట్యా చిన్నపిల్లలే కాదు యూత్ కూడా దీన్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. అసలైన సమస్య ఓవర్సీస్ లో వస్తుంది. డీజే టిల్లుకి రెండేళ్ల క్రితం యుఎస్ లో భారీ స్పందన దక్కింది. ఏకంగా 2 కోట్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించుకుంది. ఇప్పుడీ కాంపిటీషన్ వల్ల తగినన్ని స్క్రీన్లు దొరక్కపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బాలీవుడ్ నుంచి ఏదైనా నోటెడ్ రిలీజ్ ఉంటే ఇబ్బంది మరింత పెద్దదవుతుంది. ఏపీ తెలంగాణలోనూ కింగ్ కాంగ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు.
సో సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం టిల్లు స్క్వేర్ కి చాలా అవసరం. నలభై రోజుల ముందుగానే ట్రైలర్ ని వదలడం ద్వారా సితార తెలివైన ఎత్తుగడ వేసింది. వారం తిరక్కుండానే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ ఏప్రిల్ 5న వస్తుంది కాబట్టి ఆలోగా టిల్లు సూపర్ హిట్ అనిపించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అనుపమ పరమేశ్వరన్ ఎన్నడూ లేని రీతిలో గ్లామర్ షో, లిప్ లాక్ కిస్సులు చేయడంతో ఆ కోణంలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ క్రైమ్ థ్రిల్లర్ కి తమన్ అందించబోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
This post was last modified on February 17, 2024 11:37 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…