పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27 వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10 లాక్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 నుంచి తప్పుకునే సమస్యే లేదని తేల్చి చెబుతోంది. ఇవన్నీ గేమ్ ఛేంజర్ కన్నా ఆలస్యంగా మొదలైన ప్యాన్ ఇండియా సినిమాలు. కానీ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ మాత్రం ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఎంత బ్యాలన్స్ ఉందో బయటికి చెప్పడం లేదు. ఫలానా చోట షెడ్యూల్ జరుగుతోందని మీడియాకు న్యూస్ ఇవ్వడం తప్ప ఫలానా తేదీకి పూర్తవుతుందని కనీసం మాట వరసకైనా లీక్ చేస్తే ఒట్టు. దీంతో మెగా ఫ్యాన్స్ అసహనం పీక్స్ కు చేరుకుంటోంది.
నిర్మాత దిల్ రాజుకి సెప్టెంబర్ లో విడుదల చేయాలనేది టార్గెట్. కానీ శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ అధికారికంగా చెప్పలేరు. ఇంకో వైపు డేట్లు లాక్ అయిపోతున్నాయి. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చివరిగా అనౌన్స్ చేసుకుని నాకు మంచి డేట్ కావాలంటే ఇబ్బంది. నిర్మాతగా ఆయన సినిమా పోటీలో లేకపోయినా మొన్న సంక్రాంతికి జరిగిన రచ్చ దృష్ట్యా మరోసారి ఆ తలనొప్పిని మళ్ళీ భరించలేరు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉన్న నేపథ్యంలో దానితో క్లాష్ అసాధ్యం. చరణ్, చిరు ఇద్దరూ ఒప్పుకోరు. పోనీ డిసెంబర్ అంటే సలార్ లాగా నెలాఖరులో రావాల్సి ఉంటుంది.
ముందో వెనకో వీలైనంత త్వరగా గేమ్ ఛేంజర్ బృందం విడుదల గురించి ఒక కంక్లూజన్ కు రావడం ఆవసరం. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలో మూవీ రాలేదు. ఆచార్య ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. సో ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నారు. ఇంకోవైపు ఆర్సి 16 కోసం బుచ్చిబాబు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. వేసవిలో మొదలుపెట్టాలని చూస్తున్నారు. శంకర్ వదిలితే తప్ప చరణ్ బయటికి రాలేడు. ఈ చిక్కుముడులన్నీ ఎప్పుడు వీడతాయో చూడాలి.
This post was last modified on February 17, 2024 2:05 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…