అల్లరి నరేష్.. ఈ పేరెత్తగానే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పులుముకునేవి. తొలి సినిమా అల్లరి నుంచి అతను నవ్వించడమే లక్ష్యంగా సాగాడు. సుడిగాడు సినిమా టైంకి ఆ నవ్వులు పీక్స్కు చేరుకున్నాయి. ఒక టికెట్ మీద వంద సినిమాలు అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఆ పేరడీ సినిమా.. అందుకు తగ్గట్లే బోలెడంత వినోదం పంచింది. కానీ చాలా సినిమాలకు సరిపడా స్పూఫ్లు, పేరడీలు ఆ సినిమాలోనే చేసేసిన నరేష్.. ఆ తర్వాత ఏ సినిమాలో ఈ తరహా కామెడీ చేసినా వర్కవుట్ కాలేదు. వరుసబెట్టి ఫ్లాపులు ఎదురు కావడంతో అతడి కెరీర్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో తనకు అతి పెద్ద ప్లస్ అనుకున్న కామెడీనే అతను వదిలేయాల్సి వచ్చింది. నాంది సినిమాతో అతను ఇమేజ్ మేకోవర్కు ప్రయత్నించాడు. అది మంచి ఫలితాన్నిచ్చింది. సీరియస్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్టు కొట్టాడు.
ఐతే ఇక తనకు సీరియస్ సినిమాలే కలిసొస్తాయని.. వరుసగా ఆ తరహా సినిమాలు చేస్తే అవీ తేడా కొట్టడం మొదలుపెట్టాయి. మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలు తీవ్ర నిరాశను మిగల్చగా.. సభకు నమస్కారం అనే మరో సీరియస్ మూవీ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు నరేష్ తిరిగి కామెడీ బాట పడుతున్నాడు. ఆ సినిమానే.. ఆ ఒక్కటీ అడక్కు. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ కామెడీ మూవీ పేరును వాడుకుని చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమా చేస్తున్నాడు నరేష్. మల్లి అంకం అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం షూట్ చివరి దశలో ఉంది. నేరుగా టీజర్ రిలీజ్తో సినిమాను ప్రకటించారు.
ఇందులో పెళ్లి కాని ప్రసాద్ తరహా పాత్ర చేస్తున్నాడు నరేష్. అందరికీ అతడి పెళ్లి మీదే ఫోకస్ ఉంటుంది. అపార్ట్మెంట్లోని వాళ్లంతా వేర్వేరు భాషల్లో తన పెళ్లి గురించి అడుగుతుంటారు. అతను జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతుంటాడు. రాజీవ్ చిలక నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. మార్చి 22న ఆ ఒక్కటీ అడక్కు విడుదల కానుంది.
This post was last modified on February 16, 2024 10:06 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…