సినిమాలో హీరో హీరోయిన్ ఖచ్చితంగా వయసులో ఉన్న వాళ్లయితేనే ఆడియన్స్ అంగీకరిస్తారు. నిజ జీవితంలో కాకపోయినా కనీసం తెరమీద అయినా ఆ జంట ఏజ్ మహా అయితే ముప్పై అయిదు లోపలే ఉండాలి. అంతకు పెరిగితే ఒప్పుకోరు. అయినా సరే రాజేంద్ర ప్రసాద్, జయప్రద లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో ఇలాంటి ప్రయోగం చేయడమంటే విశేషమే. బ్రో, ది రాజా డీలక్స్, ఈగల్, ధమాకా లాంటి బడా స్టార్ల ప్యాన్ ఇండియా సినిమాలు తీసే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లవ్@65 పేరుతో ఈ రిస్క్ తీసుకుంటోంది. ఇవాళ టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఒక గేటెడ్ కమ్యూనిటిలో ఉండే ఒక వృద్ధ జంట ప్రేమలో పడి లోకం ఏమన్నా పట్టించుకోకుండా కలిసి ప్రయాణం చేయడమనే పాయింట్ తో ఇది రూపొందింది. దర్శకుడు విఎన్ ఆదిత్య. ఒకప్పుడు మనసంతా నువ్వే, సంతోషం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈయన తర్వాత రెండు మూడు ఫ్లాపుల వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కంబ్యాక్ కోసం ఇలాంటి రిస్కి సబ్జెక్టుని ఎంచుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా లక్ష్మి భూపాల్ సంభాషణలు అందించారు. ఎక్కడ యూత్ వాసనలు లేకుండా పూర్తిగా ఓల్డ్ ఏజ్ డ్రామా మీద కథ మొత్తం నడిపించారు.
రిస్క్ విషయానికి వస్తే ఇలాంటి కథలు ట్రెండ్ కు ఎదురీదాల్సి ఉంటుంది. కేవలం రాజేంద్ర ప్రసాద్ కోసమే థియేటర్ కు రావడమనేది ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి తర్వాత ఆగిపోయింది. ఆయన లీడ్ రోల్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లవ్@65 తో సోలో హీరోగా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ఓటిటి తరహా కంటెంట్ బిగ్ స్క్రీన్ మీద పండాలంటే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో పండాలి. ఇదంతా ఏమో కానీ దశాబ్దాల తర్వాత జయప్రదని తెరమీద చూడటం పాత ఫాన్స్ కి కొత్త అనుభూతి
This post was last modified on February 16, 2024 6:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…