తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. మొదట్లో అందరు హీరోయిన్లలో ఒకరిలా కనిపించిన అనుష్క.. ‘అరుంధతి’ దగ్గర్నుంచి తన రూటే సపరేటు అన్నట్లు సాగింది. ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ను ఎక్కడికో తీసుకెళ్లాయి.
ఐతే కొన్నేళ్ల నుంచి అనుష్క సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుండడం.. జనాల్లో పెద్దగా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకో సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. గత ఏడాది ఆమె నుంచి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మంచి విజయం సాధించడంతో ఆమెలో మళ్లీ ఉత్సాహం వచ్చినట్లుంది.
ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేస్తోంది అనుష్క. ‘వేదం’ తర్వాత ఆమె మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆ టైటిలే.. శీలావతి. ఈ పేరుతో ఒక చేప ఉందన్న సంగతి తెలిసిందే. కానీ మామూలుగా చూస్తే అమ్మాయి శీలాన్ని సూచించే సెటైరికల్ టైటిల్ లాగా అనిపిస్తుంది.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉండి వెంటనే పాపులర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనున్న సినిమా అంటున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు. అనుష్క మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…