తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. మొదట్లో అందరు హీరోయిన్లలో ఒకరిలా కనిపించిన అనుష్క.. ‘అరుంధతి’ దగ్గర్నుంచి తన రూటే సపరేటు అన్నట్లు సాగింది. ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ను ఎక్కడికో తీసుకెళ్లాయి.
ఐతే కొన్నేళ్ల నుంచి అనుష్క సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుండడం.. జనాల్లో పెద్దగా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకో సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. గత ఏడాది ఆమె నుంచి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మంచి విజయం సాధించడంతో ఆమెలో మళ్లీ ఉత్సాహం వచ్చినట్లుంది.
ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేస్తోంది అనుష్క. ‘వేదం’ తర్వాత ఆమె మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆ టైటిలే.. శీలావతి. ఈ పేరుతో ఒక చేప ఉందన్న సంగతి తెలిసిందే. కానీ మామూలుగా చూస్తే అమ్మాయి శీలాన్ని సూచించే సెటైరికల్ టైటిల్ లాగా అనిపిస్తుంది.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉండి వెంటనే పాపులర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనున్న సినిమా అంటున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు. అనుష్క మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
This post was last modified on February 16, 2024 2:40 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…