అదేంటో జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమవుతున్న బాలీవుడ్ స్టార్లు గాయాల పాలు కావడం కాకతాళీయమే అయినా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దేవర కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ చిన్న ప్రమాదానికి గురి కావడం, సమస్య తీవ్రం కాకపోయినా ఎక్కువ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం ముంబైలో విశ్రాంతి తీసుకునే పనిలో పడ్డాడు. ఏప్రిల్ 5 విడుదల నుంచి దేవర తప్పుకోవడానికి ఇదొక కారణం. ఎప్పుడు వస్తాడనేది ఈ వారంలోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు వార్ 2 కి సైతం అచ్చం ఇలాంటి ఇబ్బందే వచ్చి పడింది.
హృతిక్ రోషన్ కారణం బయటికి వెల్లడించకుండా ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. తన ఇన్సాటాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా వీల్ చైర్, హ్యాండ్ స్టిక్స్ తదితరాలు వాడాల్సి రావడం వల్ల ఏం నేర్చుకుంటున్నది అందులో పేర్కొన్నదాడు. ఎలా జరిగిందనే వివరణ ఇవ్వలేదు కానీ ఫోటో చూస్తే మాత్రం ప్రమాదమేదో పెద్దదే జరిగినట్టు అనిపిస్తోంది. ఈ లెక్కన వేసవిలోపే మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్న వార్ 2 కొంత లేట్ అవ్వొచ్చని ముంబై టాక్. ఎందుకంటే తనొచ్చాక ముందు షూట్ చేయాల్సింది యాక్షన్ ఎపిసోడ్లే. వాటితో పాటు తారక్ కాంబినేషన్ లో ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంది.
పరిస్థితి చూస్తుంటే హృతిక్ పూర్తి యాక్టివ్ కావడానికి ఇంకో అయిదారు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఫైటర్ పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ఓవర్సీస్ పుణ్యమాని వసూళ్లు బాగా రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. దీని సంగతెలా ఉన్నా వాళ్ళ ఆశలన్నీ వార్ 2 మీదే ఉన్నాయి. ఎలాగూ దేవర లేట్ అవుతోంది కాబట్టి జూనియర్ ఖాళీ సమయాన్ని వార్ 2 ఇద్దామనుకుంటే ఆ ఛాన్స్ కూడా తగ్గిపోతోంది. అదేదో పరీక్ష పెట్టినట్టు ఇలాంటివి జరిగినప్పుడే హీరోలకు కాసింత చికాకు కలగడం సహజం. వయసు ప్రభావం తన మీద ఒక్క శాతం కూడా ఉండదనుంటున్నాడు హృతిక్.
This post was last modified on February 15, 2024 11:39 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…