స్వంత భర్త దర్శకత్వంలో సినిమా. అయినా సరే నయనతార ఎక్కడైనా బావ కాని వంగతోట కాడ కాదనే సూత్రాన్ని పాటిస్తోందని చెన్నై టాక్. విజ్ఞేశ్ శివన్ డైరెక్షన్ లో ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొదలైంది. లవ్ టుడేతో జనాల దృష్టిలో పడ్డ ప్రదీప్ రంగనాథన్ హీరో. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్. ఎస్జె సూర్య లాంటి క్రేజీ క్యాస్టింగ్ వేరే ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం కావడంతో మ్యూజిక్ పరంగానూ క్రేజ్ ఉంది. హీరో అక్కగా ముందు నయనతార ఓకే చెప్పింది. ఆ మేరకు స్క్రిప్ట్ పక్కాగా రూపొందించుకున్నారు. షెడ్యూల్ కూడా జరుగుతోంది.
తాజా అప్డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు నుంచి నయన్ తప్పుకుందట. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బడ్జెట్ పరంగా ఎక్కువైపోవడంతో నిర్మాతలు తగ్గించుకోమని అడిగితే ససేమిరా అందట. ఇప్పుడామె పాత్ర కోసం ప్రత్యాన్మయం చూస్తున్నారని తెలిసింది. విజ్ఞేశ్ కూడా ప్రొడక్షన్ లో భాగస్వామి అయినప్పటికీ ఈ విషయంలో ఏం చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేశాడట. ఇప్పటికే ఈ టైటిల్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో ఇప్పుడీ సమస్య మెడకు చుట్టుకుంది. దీన్ని పరిష్కరించుకున్నా నయన్ ప్లేసులో ఎవరొస్తారో చూడాలి.
ఇక్కడ వరస డిజాస్టర్లతో కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయిన కృతి శెట్టి ఆశలన్నీ ఎల్ఐసి మీదే ఉన్నాయి. ప్రస్తుతం తనకు టాలీవుడ్ లో శర్వా సినిమా ఒకటే ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్ టైనర్ కు బాబ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే రెండు మూడు నెలల నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. ఇంకో వైపు శర్వా రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాబ్ అయిపోయిందా లేక ఇంకొంత ఆలస్యమవుతుందా చూడాలి. ఈ రెండు హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందనే ఆశతో ఉంది కృతి శెట్టి.
This post was last modified on February 14, 2024 6:15 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…