బాక్సాఫీస్ లెక్కలు, వసూళ్ల సంగతి పక్కనపెడితే సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం ఆశించిన ఫలితం అందుకోలేదన్నది వాస్తవం. మహేష్ బాబు కెపాసిటీ, త్రివిక్రమ్ బ్రాండ్ అడ్డుగోడగా నిలబడ్డాయి కానీ లేదంటే రిజల్ట్ ఇంకా భయపెట్టేది. అయితే దీని హవా ఓటిటిలో మాత్రం ఓ రేంజ్ లో ఉంది. వారం తిరక్కుండానే నెట్ ఫ్లిక్స్ ఇండియన్ క్యాటగిరీలో తెలుగు వర్షన్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, హిందీ డబ్బింగ్ నాలుగు, తమిళం ఏడో ర్యాంకులను ఆక్రమించుకున్నాయి. వరల్డ్ వైడ్ ప్రకారం చూసుకుంటే గుంటూరు కారం ఆరో ప్లేసు తీసుకుంది.
థియేట్రికల్ విండో కేవలం 28 రోజులు ఉండటంతో వ్యూస్ భారీగా వస్తున్నాయి. అఫీషియల్ గానే అన్ని భాషలు కలిపి నెట్ ఫ్లిక్స్ లాంటి ఖరీదైన ప్లాట్ ఫార్మ్ లో 4 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడమంటే మాటలు కాదు. డబ్బింగు విషయంలో తీసుకున్న శ్రద్ధ మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తోంది. యానిమల్, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు పాటించిన పద్దతే దీనికీ అనుసరించారు. ఏదో నలుగురు డబ్బింగ్ ఆర్టిస్టులతో అందరికీ చెప్పించడం కాకుండా ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా చేయించడం ఫలితాలు మెరుగు పడేలా చేస్తోంది. సో మొదటి వారం డామినేషన్ గుంటూరు కారందే.
యానిమల్ కు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన ట్రెండ్ లోనే మహేష్ ఇంత ప్రభంజనం చూపించడం విశేషం. సౌత్ మీద విపరీతమైన పెట్టుబడులు పెడుతూ హక్కులు కొంటున్న నెట్ ఫ్లిక్స్డ్ దానికి తగ్గట్టే భారీ రిటర్న్ అందుకుంటోంది. ఇండియాలో తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి తెలుగు సినిమాలే బెస్ట్ ఆప్షనని గుర్తించి దానికి తగ్గట్టే క్రేజీ డీల్స్ తో నిర్మాతలను లాగేసుకుంటోంది. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాల్లో ఏడెనిమిది నెట్ ఫ్లిక్స్ ఖాతాలోకి వచ్చేశాయి. గుంటూరు కారం లాంటి కమర్షియల్ మసాలా సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం నిజంగా విశేషమే.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…