ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత పెద్ద బడ్జెట్ తో పాటు భారీ బిజినెస్ జరుపుకుంటున్న పుష్ప 2 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే ఆగస్ట్ 15 విడుదల చేసే తీరుతానని బన్నీ, మైత్రి మూవీ మేకర్స్ కు హామీ ఇచ్చేశాడట. పుష్ప 1లో సమంతా ఐటెం సాంగ్ ఎంత కీలకంగా వ్యవహరించిందో మర్చిపోలేం. ఊ అంటావా ఊహు అంటావా అంటూ సామ్ హొయలు పోవడం, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి మాస్ ప్రియులు కిర్రెక్కిపోవడం జరిగాయి. అయితే సీక్వెల్ లో ఇలాంటి పాటకి ఛాన్స్ లేదనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.
ప్రస్తుతానికి ఇంకా ఖరారు చేయకపోయినా పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉండాలని సుకుమార్ బలంగా ఫిక్స్ అయ్యాడట. నిజానికి దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ లో ముందు పాస్ అయ్యింది ఇదేనట. అయితే షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో పాటు కీలకమైన టాకీ పార్ట్, ఇతర పాటల చిత్రీకరణ జరపకుండా స్పెషల్ పాట మీద ఫోకస్ పెట్టడం భావ్యం కాదని భావించి ఆ మేరకు పెండింగ్ పెట్టారని తెలిసింది. కల్కి 2898 ఏడి కోసం త్వరలో హైదరాబాద్ లో ఎక్కువ రోజులు ఉండబోతున్న దిశా పటానిని ఒప్పించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దాదాపు ఓకే కావొచ్చట.
సినిమా ఎంత బాగా వచ్చినా అభిమానుల నుంచి ఐటెం సాంగ్ లేదనే లోటు వినిపించకుండా సుకుమార్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ దిశాతో సాధ్యం కాకపోతే ఇంకో రెండు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తారట. విడుదలకు కేవలం అయిదు నెలలు మాత్రమే సమయముంది. ఇది చాలా తక్కువ టైం. సుకుమార్ ఎంత ఒత్తిడి ఉన్నా పర్ఫెక్షన్ కోసం పాటు పడతారు. చివరి నిముషం ప్రెజర్ల వల్ల పుష్ప 1 ఫైనల్ అవుట్ ఫుట్ లో కొంచెం క్వాలిటీ తగ్గింది. సక్సెస్ ఊపులో దాన్నెవరూ పట్టించుకోలేదు. ఈసారి అలాంటివి జరగకూడదనే టార్గెట్ తోనే సుక్కు పని చేస్తున్నారు.
This post was last modified on February 13, 2024 9:02 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…