సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఫిబ్రవరి 9కి షిఫ్ట్ అయిన ఈగల్ బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించింది. బ్రేక్ ఈవెన్ కష్టమేనని ట్రేడ్ అభిప్రాయపడుతోండగా ఊరి పేరు భైరవకోన తప్ప ఈ వీకెండ్ ఇంకే రిలీజులు లేవు కాబట్టి మరో వారాంతం కలిసి వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈగల్ కు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ ని మెచ్చిన వాళ్ళు లేకపోలేదు. కానీ ఆ ఒక్క అంశం అన్ని వర్గాల ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ముఖ్యంగా రవితేజ నుంచి ఆశించే ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం ప్రధాన లోటు.
ఒకవేళ డేట్ మార్చుకోకుండా జనవరి పండగ బరిలో ఉంటే ఏం జరిగేదని ఆలోచిస్తే కాస్త మెరుగైన ఫలితమే దక్కేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హనుమాన్ ఒక్కదానికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నా సామిరంగ డీసెంట్ గా గట్టెక్కింది. గుంటూరు కారం సైతం భారీ ఓపెనింగ్స్ తర్వాత ఎదురీదాల్సి వచ్చిందనేది వాస్తవం. సైంధవ్ పూర్తిగా వాష్ అవుట్ అయ్యింది. వెంకీ మూవీ కన్నా ఈగల్ ఎన్నో రెట్లు మెరుగనేది ఒప్పుకోవాల్సిన మాట. సంక్రాంతి హడావిడిలో రవితేజకు మైలేజ్ వచ్చేది. రెండు వారాలు కొత్త సినిమాలు లేని అవకాశాన్ని పంచుకుని ఉండేది.
ఇప్పుడు కూడా బ్యాడ్ టైం అనలేం కానీ కాస్త డ్రైగా ఉండే ఫిబ్రవరిలో యావరేజ్ కంటెంట్ తో ఎవరు వచ్చినా వాళ్లకు ఈ సమస్య తప్పదు. చాలా బాగుంది అంటే తప్ప ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఊపు కనిపించదు. మిర్చి, నేను లోకల్ లాంటివి సక్సెస్ అయ్యింది ఫిబ్రవరిలో వచ్చే. సో ఈగల్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పలేం కానీ సంక్రాంతిని వదులుకోవడం వల్ల అయిదు నుంచి పది కోట్ల దాకా గ్రాస్ రెవిన్యూ తగ్గి ఉండొచ్చన్న కామెంట్ ని కొట్టి పారేయలేం. పోనీ ప్రేమికుల రోజు ఏదైనా పికప్ ఉంటుందనుకుంటే అయిదారు రీ రిలీజులు లవర్స్ కి స్వాగతం చెబుతున్నాయి..
This post was last modified on February 13, 2024 6:02 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…