సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఏఐ(కృత్రిమ మేధస్సు) విప్లవం పెరిగాక దర్శకుల్లో కొత్త ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) లో ఇటీవలే కాలం చేసిన విజయకాంత్ ని క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నరనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చేయడం కొత్తేమి కాదు. గతంలో కలిసుందాం రా, యమదొంగ పాటల్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్టెప్పులను గ్రాఫిక్స్ తో వాడుకున్నారు. కానీ వాటిలో ఒరిజినల్ ఫుటేజ్ నే చూపిస్తారు.
ఇప్పుడలా కాదు. నిజంగానే విజయ్ కాంత్ నటించారా అనేంత సహజంగా క్యారెక్టర్ ఉంటుందట. గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర 90 దశకంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎపిసోడ్లలోనే కెప్టెన్ ఎంట్రీ ఉంటుందట. వెంకట్ ప్రభుకి ఆయనంటే విపరీతమైన అభిమానం. డైరెక్ట్ చేసే ఛాన్స్ రాకపోయినా ఎలాగోలా నివాళి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికి విజయ్ మద్దతు దొరకడం ఈ రకంగా ప్లాన్ చేశారట. ఆల్రెడీ విజయ్ 18 ఏళ్ళ వయసున్న వాడిగా చూపించేందుకు 8 కోట్లు కేవలం ఆ ఒక్క క్యారెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ కే వాడటం విశేషం.
ఇటీవలే లాల్ సలాంలో ఏఆర్ రెహమాన్ చనిపోయిన గాయకుల గొంతులని ఏఐతో మళ్ళీ వాడారు కానీ ఆ ప్రయోగం ట్యూన్స్ బాలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యింది. కానీ విజయ్ కాంత్ విషయంలో అలా జరగకపోవచ్చు. ఇది కనక స్క్రీన్ మీద పేలితే భవిష్యత్తులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండరీ స్టార్లను మనం కూడా తెరమీద చూసుకోవచ్చు. కాకపోతే భారీగా ఖర్చు అవుతుంది. ఇంకో పది పదిహేను సంవత్సరాలలో ఏఐ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుందని, ఊహించని అద్భుతాలు చూడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on February 13, 2024 2:08 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…