గుంటూరు కారం విషయంలో తమన్ మీద ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో చూశాం. కుర్చీ మడతపెట్టి పాటను మినహాయించి ఇంకేదీ అల వైకుంఠపురము స్థాయిలో మేజిక్ చేయలేదన్నది మహేష్ బాబు అభిమానుల అసంతృప్తికి ప్రధాన కారణం. సర్కారు వారి పాట గాయాన్ని మరిపించేలా చేస్తాడనుకుంటే కనీసం బీజీఎమ్ కూడా గొప్పగా ఇవ్వలేదన్నది వాళ్ళ కంప్లయింట్. సరే ఇదంతా గడిచిపోయిన గతమైపోయింది కాబట్టి తమన్ కు ఇకపై బోలెడు సవాళ్లు స్వాగతం చెప్పబోతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకమైన ప్యాన్ ఇండియా సినిమాలకు పని చేస్తున్న ఒత్తిడి 2024లో ఉంది.
వాటిలో మొదటిది పవన్ కళ్యాణ్ ఓజి. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఎన్నికలు కాగానే జరుగుతున్న షూటింగ్ కి అనుగుణంగా రీ రికార్డింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం ఎప్పుడైనా శంకర్ నుంచి పిలుపు రావొచ్చు కనక దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావొచ్చు. వీటికన్నా ముందు తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ కు ఆల్రెడీ వర్క్ మొదలయ్యింది. రవితేజతో ప్లాన్ చేసుకుని తర్వాత సన్నీ డియోల్ కు షిఫ్ట్ అయిన గోపిచంద్ మలినేని ప్రాజెక్టు కూడా తమన్ చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా షూట్ వేగంగా జరుగుతోంది.
తమిళంలో అర్జున్ దాస్ హీరోగా రూపొందుతున్న రాసవతికి తమనే స్వరకర్త. అన్నింటిని మించి ప్రభాస్ ది రాజా సాబ్ రూపంలో పెద్ద బాధ్యత తలమీద ఉంది. డిసెంబర్ లోపే పూర్తి చేయాలనే లక్ష్యంతో దర్శకుడు మారుతీ పని చేస్తున్నాడు కాబట్టి దానికి అనుగుణంగానే తమన్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో రెండు నెలలు గడిచిపోయాయి. పైన చెప్పినవేవి ఇంకా తుదిదశకు చేరుకోలేదు. అంటే ఆరేడు నెలలు తమన్ మీద విపరీతమైన ఒత్తిడి పడటం ఖాయం. తన మీద వస్తున్న కామెంట్స్ కు బలమైన సమాధానం చెప్పాలంటే వీటిలో రెండు మూడు బ్లాక్ బస్టర్స్ అయినా చాలు.
This post was last modified on February 12, 2024 10:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…