Movie News

పవన్ అభిమానులకు వీరమల్లు శుభవార్త

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా విడుదలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు మొత్తానికే క్యాన్సిల్ అయ్యిందని, నిర్మాత ఏఎం రత్నంకు డబ్బులు వెనక్కు ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నట్టు కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఎన్నికలయ్యాక ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వినిపిస్తున్న తరుణంలో ఎట్టకేలకు నిర్మాణ సంస్థ నుంచి ఒక ధృవీకరణ వచ్చింది.

ప్రస్తుతం ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో సమాంతరణంగా జరుగుతున్నాయని, ఊహలకు అందని పెద్ద స్థాయిలో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, ఆ థ్రిల్ ని టీజర్ రూపంలో ఆస్వాదించడానికి రెడీ కమ్మని చెబుతూ ట్వీట్ చేయడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. దీని సంగతలా ఉంచితే షూటింగ్ బ్యాలన్స్ ఉన్న మాట వాస్తవమే. దర్శకుడు క్రిష్ అనుష్కతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మొదలుపెట్టిన వార్త నిజమే. కాకపోతే కొంచెం టైం పట్టినా వీరమల్లు అయితే వస్తాడు.

ఒకరకంగా చెప్పాలంటే పుకార్లకు చెక్ పెట్టేయడం మంచిదే. ఇంత పెద్ద పీరియాడిక్ డ్రామా పట్ల ఫ్యాన్స్ కున్న ఎగ్జైట్ మెంట్ చప్పున చల్లారకుండా ఎప్పటికప్పుడు గాసిపులకు బ్రేక్ పడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హరిహరవీరమల్లులో బాబీ డియోల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలా చూసుకున్నా 2024 విడుదల సాధ్యం కాదు కానీ వచ్చే సంవత్సరం ఆశించవచ్చు. ఓజి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కనక 2025 వేసవిలో హరిహర వీరమల్లుని ప్లాన్ చేసుకోవచ్చు. కుదరకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు.

This post was last modified on February 12, 2024 9:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

3 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

4 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

4 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 hours ago