Movie News

పవన్ అభిమానులకు వీరమల్లు శుభవార్త

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా విడుదలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు మొత్తానికే క్యాన్సిల్ అయ్యిందని, నిర్మాత ఏఎం రత్నంకు డబ్బులు వెనక్కు ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నట్టు కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఎన్నికలయ్యాక ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వినిపిస్తున్న తరుణంలో ఎట్టకేలకు నిర్మాణ సంస్థ నుంచి ఒక ధృవీకరణ వచ్చింది.

ప్రస్తుతం ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో సమాంతరణంగా జరుగుతున్నాయని, ఊహలకు అందని పెద్ద స్థాయిలో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, ఆ థ్రిల్ ని టీజర్ రూపంలో ఆస్వాదించడానికి రెడీ కమ్మని చెబుతూ ట్వీట్ చేయడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. దీని సంగతలా ఉంచితే షూటింగ్ బ్యాలన్స్ ఉన్న మాట వాస్తవమే. దర్శకుడు క్రిష్ అనుష్కతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మొదలుపెట్టిన వార్త నిజమే. కాకపోతే కొంచెం టైం పట్టినా వీరమల్లు అయితే వస్తాడు.

ఒకరకంగా చెప్పాలంటే పుకార్లకు చెక్ పెట్టేయడం మంచిదే. ఇంత పెద్ద పీరియాడిక్ డ్రామా పట్ల ఫ్యాన్స్ కున్న ఎగ్జైట్ మెంట్ చప్పున చల్లారకుండా ఎప్పటికప్పుడు గాసిపులకు బ్రేక్ పడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హరిహరవీరమల్లులో బాబీ డియోల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలా చూసుకున్నా 2024 విడుదల సాధ్యం కాదు కానీ వచ్చే సంవత్సరం ఆశించవచ్చు. ఓజి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కనక 2025 వేసవిలో హరిహర వీరమల్లుని ప్లాన్ చేసుకోవచ్చు. కుదరకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు.

This post was last modified on February 12, 2024 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…

13 minutes ago

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

2 hours ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

3 hours ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

4 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

4 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

5 hours ago