వచ్చే నెల మార్చి 1 విడుదల కాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ మీద వరుణ్ తేజ్ పెట్టుకున్న నమ్మకం చాలా పెద్దది. సోలో హీరోగా రెండు దారుణమైన డిజాస్టర్లు గని, గాండీవదారి అర్జునలు మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మెగా ప్రిన్స్ ట్యాగ్ ఉన్నప్పటికీ అదేమీ భారీ ఓపెనింగ్స్ కి ఉపయోగపడటం లేదు. షోలు పడక ముందే ఫ్లాపులు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ఇప్పుడలా రిపీట్ కాదనే ధైర్యంతో ప్యాన్ ఇండియా ప్రమోషన్లు భారీ ఎత్తున చేస్తున్నాడు. ఒక్క ముంబై మీడియాకి ఇరవై ఆరు ఇంటర్వ్యూలకు ఎస్ చెప్పాడట. ఆ ఓపికలోనే తన కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవచ్చు.
ఇది అందరు చేసేదే అనుకోవచ్చు కానీ ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. ఇటీవలే రిలీజైన హృతిక్ రోషన్ ఫైటర్ టాక్, రివ్యూల పరంగా ఏమంత ఆశాజనకంగా ఫీడ్ బ్యాక్ తెచ్చుకోలేదు. అయినా సరే మూడు వందల కోట్ల వసూళ్లు దాటించి షాక్ ఇచ్చింది. రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ గాల్లో జరిగే విమానాల యుద్ధాన్ని ఓవర్ సీస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అదే తరహా బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. కాకపోతే దీంట్లో ఎమోషన్లు, వార్ ఎపిసోడ్లు, లవ్ ట్రాక్ ఫైటర్ తో పోల్చుకుంటే బాగా వచ్చాయని వరుణ్ మూవీకి పని చేసిన వాళ్ళ కామెంట్.
ఇదే నిజమైతే వరుణ్ తేజ్ కి చాలా ప్రయోజనాలు రాబోతున్నాయి. మొదటిది బాలీవుడ్ డెబ్యూ ప్రాపర్ గా జరిగిపోతుంది. తాను చేయబోయే తర్వాతి సినిమాలకు నార్త్ మార్కెట్ వస్తుంది. పైగా మానుషీ చిల్లార్ హీరోయిన్ కావడంతో ఫ్లేవర్ పరంగా ఇబ్బంది లేదు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కూడా హిందీ బ్యాచే. ఉత్తరాది ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాక వరుణ్ తేజ్ తెలుగు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. సోనీ సంస్థ నిర్మాణం కావడంతో ఇక్కడ స్టార్ హీరోల సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ఈ నెలాఖరున ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on February 12, 2024 4:54 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…