వచ్చే నెల మార్చి 1 విడుదల కాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ మీద వరుణ్ తేజ్ పెట్టుకున్న నమ్మకం చాలా పెద్దది. సోలో హీరోగా రెండు దారుణమైన డిజాస్టర్లు గని, గాండీవదారి అర్జునలు మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మెగా ప్రిన్స్ ట్యాగ్ ఉన్నప్పటికీ అదేమీ భారీ ఓపెనింగ్స్ కి ఉపయోగపడటం లేదు. షోలు పడక ముందే ఫ్లాపులు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ఇప్పుడలా రిపీట్ కాదనే ధైర్యంతో ప్యాన్ ఇండియా ప్రమోషన్లు భారీ ఎత్తున చేస్తున్నాడు. ఒక్క ముంబై మీడియాకి ఇరవై ఆరు ఇంటర్వ్యూలకు ఎస్ చెప్పాడట. ఆ ఓపికలోనే తన కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవచ్చు.
ఇది అందరు చేసేదే అనుకోవచ్చు కానీ ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. ఇటీవలే రిలీజైన హృతిక్ రోషన్ ఫైటర్ టాక్, రివ్యూల పరంగా ఏమంత ఆశాజనకంగా ఫీడ్ బ్యాక్ తెచ్చుకోలేదు. అయినా సరే మూడు వందల కోట్ల వసూళ్లు దాటించి షాక్ ఇచ్చింది. రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ గాల్లో జరిగే విమానాల యుద్ధాన్ని ఓవర్ సీస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అదే తరహా బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. కాకపోతే దీంట్లో ఎమోషన్లు, వార్ ఎపిసోడ్లు, లవ్ ట్రాక్ ఫైటర్ తో పోల్చుకుంటే బాగా వచ్చాయని వరుణ్ మూవీకి పని చేసిన వాళ్ళ కామెంట్.
ఇదే నిజమైతే వరుణ్ తేజ్ కి చాలా ప్రయోజనాలు రాబోతున్నాయి. మొదటిది బాలీవుడ్ డెబ్యూ ప్రాపర్ గా జరిగిపోతుంది. తాను చేయబోయే తర్వాతి సినిమాలకు నార్త్ మార్కెట్ వస్తుంది. పైగా మానుషీ చిల్లార్ హీరోయిన్ కావడంతో ఫ్లేవర్ పరంగా ఇబ్బంది లేదు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కూడా హిందీ బ్యాచే. ఉత్తరాది ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాక వరుణ్ తేజ్ తెలుగు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. సోనీ సంస్థ నిర్మాణం కావడంతో ఇక్కడ స్టార్ హీరోల సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ఈ నెలాఖరున ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on February 12, 2024 4:54 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…