మనకు ఫ్యామిలీ సినిమాల్లోనే కనిపిస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్ రూటు మారుస్తోంది. మాస్ వైపు మొగ్గు చూపిస్తోంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ కూల్ అండ్ ఎమోషనల్ మూవీసే. కానీ మొదటిసారి కమర్షియల్ దారి పట్టినట్టు టాక్. శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో తననే హీరోయిన్ గా అనుకుంటున్న విషయం రెండు నెలల క్రితమే బయటికి వచ్చింది. స్క్రిప్ట్ కోసం టైం ఎక్కువగా తీసుకున్న దాస్ దాన్ని ఒక కొలిక్కి తెచ్చారట. అయితే దీనికి మల్టీస్టారర్ హంగులు ఉంటాయని తెలిసింది.
ఒక కీలక పాత్రకు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని సంప్రదిస్తే ఆయన దాదాపు ఓకే అన్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, విజయ్ జిల్లా లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమవ్వడం ద్వారా ఈ మలయాళీ స్టార్ మనకు బాగానే దగ్గరయ్యాడు. దానికి తగ్గట్టు పవర్ ఫుల్ క్యారెక్టర్లకు అతికినట్టు సరిపోతారు కాబట్టి ఆయన్ను సంప్రదించడం, సానుకూల స్పందన రావడం జరిగిపోయినట్టు తెలిసింది. తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ తో పాటు టాలీవుడ్ కు చెందిన ఓ మీడియం స్టార్ హీరోని ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట. ఎవరెనేది పేరు లీక్ కాలేదు.
బాలీవుడ్ లో గ్లామర్ షోలకు సైతం ఓకే అంటున్న మృణాల్ ఠాకూర్ సౌత్ లో మాత్రం హోమ్లీ మాత్రమే అంటోంది. క్రమంగా ఆ నిర్ణయంలోనూ మార్పు వచ్చేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఇంకా కొత్త తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. దాని ఫలితం వచ్చాక రెమ్యునరేషన్ పెంచాలనే ఆలోచనో లేక స్టార్ డం పెరిగాక కథలను ఇంకా జాగ్రత్తగా విందామనే ప్లానో చూడాలి. హిందీలో పూజా మేరీ జాన్ ఒకటే మృణాల్ లిస్టులో రిలీజ్ కు రెడీగా ఉంది.
This post was last modified on February 12, 2024 4:16 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…