ఈ ఏడాది ఆగస్ట్ 15 మీద చాలా ప్యాన్ ఇండియా సినిమాలు కన్నేశాయి. కారణం ఒకటే. ఆల్రెడీ దాని మీద అధికారికంగా కర్చీఫ్ వేసిన పుష్ప 2 ది రూల్ ఖచ్చితంగా రాదనే నమ్మకంతో. దేవర లాగా వాయిదా వార్త రాకపోదా, వెంటనే లాక్ చేసుకోకపోమా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. వాటిలో నాని సరిపోదా శనివారం, కమల్ హాసన్ భారతీయుడు 2 లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకవేళ వేసవి దాటిపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవర 1 కూడా అదే స్లాట్ కోరుకుంటోంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్పష్టంగా పోస్ట్ పోన్ సమస్యే లేదని అధికారికంగా నొక్కి చెబుతోంది.
తాజాగా రష్మిక మందన్న సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని ఒకటి క్లిక్ చేసి షేర్ చేసుకుంది. దాన్ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. సో ఆరు నూరైనా తప్పుకునే ఛాన్స్ లేదన్న మాట. ఇప్పటిదాకా యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన పుష్ప 2 ని జూలై లోగా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుమ్మడికాయ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్లకు అవసరం కాబట్టి అవసరమైన ఒత్తిడిని రాకుండా చూడమని అల్లు అర్జున్ చెప్పిన సూచనల మేరకు పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ జరుగుతోంది.
ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిలు మీద బయటికొచ్చిన ఆర్టిస్టు జగదీశ్ తో ఉన్న కాంబో సీన్లన్నీ ముందు తీస్తున్నారు. జాతర ఎపిసోడ్ దాదాపు అయిపోయిందని టాక్. పుష్ప 3 గురించి గట్టిగా వినిపిస్తున్న తరుణంలో మూడో భాగం ఉంటుందా లేదానే దాని గురించి టీమ్ నోరు విప్పడం లేదు. సినిమా చూశాక చివర్లో సర్ప్రైజ్ ఇస్తారా లేక విడుదలకు ముందు ఇచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఏమైనా చెబుతారా అనేది వేచి చూడాలి. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం కూడా ఆగస్ట్ 15కి ఖచ్చితంగా రావాలనే టార్గెట్ కి కారణమని టాక్. ఏదైతేనేం టైంకి వస్తే సినీ ప్రియులకు అదే సంతోషం.
This post was last modified on February 12, 2024 1:55 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…