ఈ ఏడాది ఆగస్ట్ 15 మీద చాలా ప్యాన్ ఇండియా సినిమాలు కన్నేశాయి. కారణం ఒకటే. ఆల్రెడీ దాని మీద అధికారికంగా కర్చీఫ్ వేసిన పుష్ప 2 ది రూల్ ఖచ్చితంగా రాదనే నమ్మకంతో. దేవర లాగా వాయిదా వార్త రాకపోదా, వెంటనే లాక్ చేసుకోకపోమా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. వాటిలో నాని సరిపోదా శనివారం, కమల్ హాసన్ భారతీయుడు 2 లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకవేళ వేసవి దాటిపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవర 1 కూడా అదే స్లాట్ కోరుకుంటోంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్పష్టంగా పోస్ట్ పోన్ సమస్యే లేదని అధికారికంగా నొక్కి చెబుతోంది.
తాజాగా రష్మిక మందన్న సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని ఒకటి క్లిక్ చేసి షేర్ చేసుకుంది. దాన్ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. సో ఆరు నూరైనా తప్పుకునే ఛాన్స్ లేదన్న మాట. ఇప్పటిదాకా యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన పుష్ప 2 ని జూలై లోగా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుమ్మడికాయ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్లకు అవసరం కాబట్టి అవసరమైన ఒత్తిడిని రాకుండా చూడమని అల్లు అర్జున్ చెప్పిన సూచనల మేరకు పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ జరుగుతోంది.
ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిలు మీద బయటికొచ్చిన ఆర్టిస్టు జగదీశ్ తో ఉన్న కాంబో సీన్లన్నీ ముందు తీస్తున్నారు. జాతర ఎపిసోడ్ దాదాపు అయిపోయిందని టాక్. పుష్ప 3 గురించి గట్టిగా వినిపిస్తున్న తరుణంలో మూడో భాగం ఉంటుందా లేదానే దాని గురించి టీమ్ నోరు విప్పడం లేదు. సినిమా చూశాక చివర్లో సర్ప్రైజ్ ఇస్తారా లేక విడుదలకు ముందు ఇచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఏమైనా చెబుతారా అనేది వేచి చూడాలి. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం కూడా ఆగస్ట్ 15కి ఖచ్చితంగా రావాలనే టార్గెట్ కి కారణమని టాక్. ఏదైతేనేం టైంకి వస్తే సినీ ప్రియులకు అదే సంతోషం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…