ఈ ఏడాది ఆగస్ట్ 15 మీద చాలా ప్యాన్ ఇండియా సినిమాలు కన్నేశాయి. కారణం ఒకటే. ఆల్రెడీ దాని మీద అధికారికంగా కర్చీఫ్ వేసిన పుష్ప 2 ది రూల్ ఖచ్చితంగా రాదనే నమ్మకంతో. దేవర లాగా వాయిదా వార్త రాకపోదా, వెంటనే లాక్ చేసుకోకపోమా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. వాటిలో నాని సరిపోదా శనివారం, కమల్ హాసన్ భారతీయుడు 2 లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకవేళ వేసవి దాటిపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవర 1 కూడా అదే స్లాట్ కోరుకుంటోంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్పష్టంగా పోస్ట్ పోన్ సమస్యే లేదని అధికారికంగా నొక్కి చెబుతోంది.
తాజాగా రష్మిక మందన్న సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని ఒకటి క్లిక్ చేసి షేర్ చేసుకుంది. దాన్ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. సో ఆరు నూరైనా తప్పుకునే ఛాన్స్ లేదన్న మాట. ఇప్పటిదాకా యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన పుష్ప 2 ని జూలై లోగా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుమ్మడికాయ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్లకు అవసరం కాబట్టి అవసరమైన ఒత్తిడిని రాకుండా చూడమని అల్లు అర్జున్ చెప్పిన సూచనల మేరకు పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ జరుగుతోంది.
ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిలు మీద బయటికొచ్చిన ఆర్టిస్టు జగదీశ్ తో ఉన్న కాంబో సీన్లన్నీ ముందు తీస్తున్నారు. జాతర ఎపిసోడ్ దాదాపు అయిపోయిందని టాక్. పుష్ప 3 గురించి గట్టిగా వినిపిస్తున్న తరుణంలో మూడో భాగం ఉంటుందా లేదానే దాని గురించి టీమ్ నోరు విప్పడం లేదు. సినిమా చూశాక చివర్లో సర్ప్రైజ్ ఇస్తారా లేక విడుదలకు ముందు ఇచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఏమైనా చెబుతారా అనేది వేచి చూడాలి. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం కూడా ఆగస్ట్ 15కి ఖచ్చితంగా రావాలనే టార్గెట్ కి కారణమని టాక్. ఏదైతేనేం టైంకి వస్తే సినీ ప్రియులకు అదే సంతోషం.
This post was last modified on February 12, 2024 1:55 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…