రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలనేది సుషాంత్ సింగ్ అభిమానుల డిమాండ్. బీహార్ ఎన్నికల నేపథ్యంలో సుషాంత్ సింగ్ కేస్ పొలిటికల్గాను ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరతగతిన న్యాయం చేసేయాలనే ఆరాటం ప్రభుత్వం చూపించింది. అయితే చాలా మంది అనుమానించినట్టు సుషాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్ర ఏమీ లేదు. కనీసం సిబిఐ విచారణలో అయితే ఆ దిశగా ఏమీ బయటపడలేదు. అలాగే అతని ఆరోగ్యం క్షీణించడానికి ఆమె ఏవో మందులు వాడిందనే ఆరోపణలు కానీ, అతని డబ్బుని దుర్వినియోగం చేసి తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుందనే ఆరోపణలు కానీ రుజువు కాలేదు. అసలు న్యాయం కావాలని డిమాండ్ చేసింది ఈ విషయాలలో అయితే, ఇన్నాళ్ల పాటు విచారణలో డ్రగ్స్ క్రయము, వినియోగం విషయంలో మాత్రమే రియా దోషిగా తేలింది.
ఆమెను అరెస్ట్ చేయాలనేది జనం డిమాండ్ కాబట్టి అది నెరవేర్చడానికి ఈ ఒక్క నేరం సరిపోయింది. అందుకే ముందు ఆమె సోదరుడిని, తర్వాత రియాను అరెస్ట్ చేసేసింది. ఏదయితేనేమి రియా అరెస్ట్ అయింది కదా అంటూ సుషాంత్ ఆర్మీ సంబరాలు చేసుకుంటోంది. ఇది బాలీవుడ్ పెద్దల కుట్ర, సుషాంత్ మాజీ మేనేజర్తో పాటు ఇది డబుల్ మర్డర్, ఒక బడా రాజకీయ నాయకుడి పాత్ర… ఇలా వివిధ థియరీలు వినిపించిన వాళ్లు అదంతా వదిలేసి డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అవడాన్ని ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ డిమాండ్స్ కి తగ్గట్టు ప్రభుత్వాలు నడుస్తోన్న తీరుకి ఇదో తాజా ఉదాహరణ మాత్రమే.
This post was last modified on September 8, 2020 9:14 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…