ఈ సీజన్ బిగ్బాస్ హౌస్లోకి ఎంటరయిన వాళ్ల గురించి చాలా ఫన్నీ మీమ్స్ వచ్చాయి. ‘ఎవరు మమ్మీ వీళ్లంతా’ అనే అలీ మీమ్, ‘ఎవర్రా మీరు?’ అనే సోనూ సూద్ మీమ్ చాలా పాపులర్ అయ్యాయి. హౌస్లోకి వెళ్లిన వాళ్లలో చాలా మంది ఎవరో కూడా ఆడియన్స్కి తెలియకపోవడంతో ఈ మీమ్స్ ఇన్స్టంట్గా కనక్ట్ అయ్యాయి. ఒక తెలిసిన ముఖాన్ని త్వరగా ఇంట్లోకి ప్రవేశ పెట్టాలని బిగ్బాస్ క్రియేటివ్ టీమ్ డిసైడ్ అయింది. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన అవినాష్ వచ్చే ఆదివారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. షో మొదలు కావడానికి ముందే పదహారు రోజుల క్వారంటైన్లోకి వెళ్లాలని బిగ్బాస్ చెప్పగా అవినాష్ వారం రోజులు లేట్గా క్వారంటైన్లోకి వెళ్లాడట. అందుకే అతని ఎంట్రీ ఒక వారం ఆలస్యంగా జరుగుతుందన్నమాట.
హౌస్లో వున్న వాళ్లలో వినోదం పండించడం కంటే డ్రామా పండించడానికి చూస్తున్నారు. అవినాష్లాంటి కమెడియన్ వెళితే కాస్త ఆట, పాట పెరుగుతాయేమో. విశేషం ఏమిటంటే ఇంతవరకు పధ్నాలుగు మంది మాత్రమే హౌస్లోకి వెళ్లగా, ఇద్దరు సీక్రెట్ రూమ్లోనే వున్నారు. అయితే వాళ్లను సీక్రెట్గా వుంచిన సంగతి ఇంట్లోని మిగతా సభ్యులు కనిపెట్టేసారు. ఈ దాచిపెట్టిన వాళ్లను అయినా ఎవరైనా కొంచెం పాపులర్ అయిన వాళ్లను పెట్టి వుంటే బాగుండేదిగా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
This post was last modified on September 8, 2020 9:11 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…