యాత్ర సినిమాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చాలా గొప్పగా చూపించి ఆయన అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు మహి.వి.రాఘవ్. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రిలీజైన ఈ చిత్రం వైసీపీ పట్ల జనాల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచడానికి కొంత కారణమైంది. ఇప్పుడు మహి మరోసారి ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోను చేస్తూ ‘యాత్ర-2’ తీసి విడుదల చేశారు. ఈ చిత్రం వైసీపీ అభిమానులకు బాగానే నచ్చుతోంది. జగన్ ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. జగన్ సైతం ఈ సినిమా చూసి చాలా సంతోషించి ఉంటాడనడంలో సందేహం లేదు. ఐతే వైఎస్, జగన్ల మీద రెండు సినిమాలు తీసి మెప్పించిన మహికి జగన్ సర్కారు నుంచి కానుక అందుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒక ప్రముఖ తెలుగు పత్రిక మహికి జగన్ సర్కారు ఇస్తున్న తాయిలం గురించి ఈ రోజు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. స్టూడియో కడతానని మహి అప్లికేషన్ పెట్టుకోవడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్లో రెండు ఎకరాల ఖరీదైన స్థలాన్ని మహికి కట్టబెట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మహి అప్లికేషన్ను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. దీంతో ‘యాత్ర-2’ విడుదల రోజే ఆర్డీవో వెళ్లి స్థల పరిశీలన చేశారు. రెండు ఎకరాల ఆ స్థలం విలువ రూ.20 కోట్లని.. దాన్ని నామమాత్రపు ధరకు మహికి ఇవ్వబోతున్నారని.. ఈ మేరకు చకచకా ఫైల్స్ కదులుతున్నాయని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఐతే ఈ వార్తలపై మహి పరోక్షంగా స్పందిచాడు ట్విట్టర్లో. బురద చల్లడం మన పని కడుక్కుంటాడా, తుడుచుకుంటాడా అన్నది అవతలి వాడి ఇష్టం అంటూ తాను ‘యాత్ర-2’లో రాసిన డైలాగ్ను ఉటంకిస్తూ మీడియాపై విమర్శలు గుప్పించాడు మహి. ఈ ట్వీట్ చివర్లో తాను తన చివరి మూడు చిత్రాలను రాయలసీమలోనే తీసిన విషయాన్ని ప్రస్తావించాడు. దీన్ని బట్టి రాయలసీమకు తన సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని.. తనకు స్టూడియో కోసం స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే తప్పేంటని మహి పరోక్షంగా పేర్కొన్నట్లు అనిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో నిజానిజాలెంతో చూడాలి.
This post was last modified on February 11, 2024 11:12 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…