Movie News

కొత్త రచ్చ : ‘యాత్ర’ దర్శకుడికి రెండెకరాల స్థలం?

యాత్ర సినిమాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చాలా గొప్పగా చూపించి ఆయన అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు మహి.వి.రాఘవ్. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రిలీజైన ఈ చిత్రం వైసీపీ పట్ల జనాల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచడానికి కొంత కారణమైంది. ఇప్పుడు మహి మరోసారి ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోను చేస్తూ ‘యాత్ర-2’ తీసి విడుదల చేశారు. ఈ చిత్రం వైసీపీ అభిమానులకు బాగానే నచ్చుతోంది. జగన్ ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. జగన్ సైతం ఈ సినిమా చూసి చాలా సంతోషించి ఉంటాడనడంలో సందేహం లేదు. ఐతే వైఎస్, జగన్‌ల మీద రెండు సినిమాలు తీసి మెప్పించిన మహికి జగన్ సర్కారు నుంచి కానుక అందుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒక ప్రముఖ తెలుగు పత్రిక మహికి జగన్ సర్కారు ఇస్తున్న తాయిలం గురించి ఈ రోజు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. స్టూడియో కడతానని మహి అప్లికేషన్ పెట్టుకోవడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాల ఖరీదైన స్థలాన్ని మహికి కట్టబెట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మహి అప్లికేషన్‌ను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. దీంతో ‘యాత్ర-2’ విడుదల రోజే ఆర్డీవో వెళ్లి స్థల పరిశీలన చేశారు. రెండు ఎకరాల ఆ స్థలం విలువ రూ.20 కోట్లని.. దాన్ని నామమాత్రపు ధరకు మహికి ఇవ్వబోతున్నారని.. ఈ మేరకు చకచకా ఫైల్స్ కదులుతున్నాయని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఐతే ఈ వార్తలపై మహి పరోక్షంగా స్పందిచాడు ట్విట్టర్లో. బురద చల్లడం మన పని కడుక్కుంటాడా, తుడుచుకుంటాడా అన్నది అవతలి వాడి ఇష్టం అంటూ తాను ‘యాత్ర-2’లో రాసిన డైలాగ్‌ను ఉటంకిస్తూ మీడియాపై విమర్శలు గుప్పించాడు మహి. ఈ ట్వీట్ చివర్లో తాను తన చివరి మూడు చిత్రాలను రాయలసీమలోనే తీసిన విషయాన్ని ప్రస్తావించాడు. దీన్ని బట్టి రాయలసీమకు తన సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని.. తనకు స్టూడియో కోసం స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే తప్పేంటని మహి పరోక్షంగా పేర్కొన్నట్లు అనిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో నిజానిజాలెంతో చూడాలి.

This post was last modified on February 11, 2024 11:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Yatra

Recent Posts

ఆపరేషన్ అరణ్యకు శ్రీకారం చుట్టిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…

2 hours ago

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

4 hours ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

6 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

10 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

11 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

12 hours ago