ప్రతి నటుడి కెరీర్లో కొన్ని ప్రతిష్ఠాత్మక సినిమాలు ఉంటాయి. వాటి కోసం ఎంతో కష్టపడతారు. చాలా సమయం పెడతారు. ఆ చిత్రాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిస్తే కుంగిపోతారు. ఆమిర్ ఖాన్ కెరీర్లో లాల్ సింగ్ చడ్డా అలాంటి సినిమానే. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఆమిర్ నిర్మాణంలో అతడి మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాకు ఆమిర్ అన్నీ తానై వ్యవహరించాడు. చాలా టైం తీసుకుని పెద్ద బడ్జెట్లో ఈ సినిమా చేశాడు. కానీ చివరికి తీవ్ర నిరాశ తప్పలేదు. విపరీతమైన నెగెటివిటీ మధ్య రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్ టాకే రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఆమిర్ పెట్టిన పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం అంతా వృథా అయిపోయింది.
ఈ ఫలితంతో తీవ్ర నిరాశ చెందిన ఆమిర్ కొంత కాలం సినిమాల ఊసే ఎత్తలేదు. ఈ మధ్యే తారే జమీన్ పర్ సీక్వెల్ సితారె జమీన్ పర్ను మొదలు పెట్టాడు. లాల్ సింగ్ చడ్డా ఆమిర్ను ఎంత బాధ పెట్టింది అతడి మాజీ భార్య కిరణ్ రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమిర్ మీద ఇప్పటిదాకా ఏ సినిమా చూపించనంత ప్రభావం ఈ మూవీ చూపించిందని ఆమె చెప్పింది. ఆమిర్ చాలా రోజులు ఈ ఫలితం గురించి మాట్లాడాడని చెప్పింది. లాల్ సింగ్ చడ్డా ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఆమె వెల్లడించింది. ఈ సినిమాకు అలాంటి ఫలితం వస్తుందని టీంలో ఎవ్వరూ ఊహించలేదని ఆమె చెప్పింది. తాము ఆ సినిమా వైఫల్యాన్ని అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు కిరణ్ తెలిపింది. కిరణ్తో వైవాహిక బంధం నుంచి బయటికి వచ్చినప్పటికీ.. ఆమెతో సినిమా బంధం మాత్రం కొనసాగిస్తున్నాడు ఆమిర్. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాపతా లేడీస్కు ఆమిరే నిర్మాత
This post was last modified on February 11, 2024 11:09 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…