నా సామిరంగ సక్సెస్ తో ఊపుమీదున్న నాగార్జున వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ డ్రామా ఆల్రెడీ షూటింగ్ లో ఉంది..రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది కాకుండా తమిళ దర్శకుడు నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించే ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ని వేసవిలోగానే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకో ప్రాజెక్టు కోసం దర్శకుడు సుబ్బుకి నాగ్ ఎస్ చెప్పినట్టు తెలిసింది.
కోర్ట్ రూమ్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో ప్రియమణిని ఎంపిక చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నారట. ఈ జోడి గతంలో రగడ చేసిన సంగతి గుర్తే. 2010లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ప్రియమణికి తగిన ప్రాధాన్యంతో పాటు కింగ్ తో ఆడిపాడే పాటలు దక్కాయి. ఇటీవలే మలయాళం బ్లాక్ బస్టర్ నేరులో నటించాక ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రైమ్ లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బ్రేక్ ఇచ్చినప్పటికీ గత రెండేళ్లుగా మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి..
ఇక నాగార్జున విషయానికి వస్తే బంగార్రాజు 3 చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఎంతమేరకు కార్యరూపం దాలుస్తుందో స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దర్శకత్వం కళ్యాణ్ కృష్ణనే చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా రావాల్సి ఉంది. నా సామిరంగ కాకుండా ఈ ఏడాది ఇంకో రిలీజ్ ఉండేలా చూస్తున్నారు. ఎంతమేరకు సాధ్యమవుతుందో ఇప్పుడే చెప్పలేం. ముందు జాగ్రత్త చర్యగా సంక్రాంతికో కర్చీఫ్ అయితే వేసి పెట్టారు కానీ ఆయన చేసే వాటిలో ఏదో వస్తుందో మాత్రం ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలుపెట్టొచ్చట కానీ ఈసారి నాగ్ చేయకపోవచ్చని టాక్.
This post was last modified on February 11, 2024 9:46 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…