నా సామిరంగ సక్సెస్ తో ఊపుమీదున్న నాగార్జున వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ డ్రామా ఆల్రెడీ షూటింగ్ లో ఉంది..రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది కాకుండా తమిళ దర్శకుడు నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించే ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ని వేసవిలోగానే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకో ప్రాజెక్టు కోసం దర్శకుడు సుబ్బుకి నాగ్ ఎస్ చెప్పినట్టు తెలిసింది.
కోర్ట్ రూమ్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో ప్రియమణిని ఎంపిక చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నారట. ఈ జోడి గతంలో రగడ చేసిన సంగతి గుర్తే. 2010లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ప్రియమణికి తగిన ప్రాధాన్యంతో పాటు కింగ్ తో ఆడిపాడే పాటలు దక్కాయి. ఇటీవలే మలయాళం బ్లాక్ బస్టర్ నేరులో నటించాక ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రైమ్ లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బ్రేక్ ఇచ్చినప్పటికీ గత రెండేళ్లుగా మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి..
ఇక నాగార్జున విషయానికి వస్తే బంగార్రాజు 3 చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఎంతమేరకు కార్యరూపం దాలుస్తుందో స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దర్శకత్వం కళ్యాణ్ కృష్ణనే చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా రావాల్సి ఉంది. నా సామిరంగ కాకుండా ఈ ఏడాది ఇంకో రిలీజ్ ఉండేలా చూస్తున్నారు. ఎంతమేరకు సాధ్యమవుతుందో ఇప్పుడే చెప్పలేం. ముందు జాగ్రత్త చర్యగా సంక్రాంతికో కర్చీఫ్ అయితే వేసి పెట్టారు కానీ ఆయన చేసే వాటిలో ఏదో వస్తుందో మాత్రం ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలుపెట్టొచ్చట కానీ ఈసారి నాగ్ చేయకపోవచ్చని టాక్.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…