గత ఏడాది భోళా శంకర్ డిజాస్టర్ ఫలితం చిరంజీవిలో తీవ్ర ఆత్మ పరిశీలనకు ప్రేరేపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అభిమానులు ఎగబడి చూస్తారనే భ్రమలను పూర్తిగా తొలగించిన కళాఖండమది. రిలీజ్ రోజు ఉదయం బెనిఫిట్ షోలు సైతం చాలా చోట్ల ఫుల్ కాలేదంటేనే ఫ్యాన్స్ దాని పట్ల ఎంత అనాసక్తిగా ఉన్నారో ట్రేడ్ కి అర్థమైపోయింది. దెబ్బకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ప్లాన్ చేసుకున్న సినిమాని మెగాస్టార్ ఉన్నఫళానా ఆపేశారు. కాస్త లేట్ గా అనుకున్న విశ్వంభరని ముందుకు తెచ్చి ఏడాది సమయం కేటాయించేందుకు సిద్ధపడ్డారు. ఇదో గొప్ప పాఠం.
అచ్చం ఇదే పరిస్థితి సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చింది. నిన్న విడుదలైన లాల్ సలామ్ ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ అంటే ఏమో అనుకోవచ్చు తమిళనాడులోనూ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. ఏపీ తెలంగాణలో పలు చోట్ల నెగటివ్ షేర్లు నమోదైనట్టు తెలిసింది. జైలర్ వచ్చి పట్టుమని తొమ్మిది నెలలు కాలేదు. రెండు వారాలు సులభంగా టికెట్లు దొరకని రేంజ్ లో అది బ్లాక్ బస్టరయ్యింది. కనీసం దాని ప్రభావం ఉన్నా లాల్ సలామ్ కి ఈ దుస్థితి ఉండేది కాదు. ఆడియన్స్ స్టార్ డం కన్నా కంటెంట్ వైపే చూస్తున్నారని వేరే చెప్పాలా.
ఇదంతా చూసి తలైవర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. కూతురు ఐశ్వర్య మీద నమ్మకం, ప్రేమతో రజినీకాంత్ కథని పూర్తిగా విశ్లేషించుకోకుండా ఓకే చేశారని, దాని వల్ల ఇప్పుడీ ఓపెనింగ్ తో తల దించుకునే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో వాపోతున్నారు. పోనీ డివైడ్ టాక్ వచ్చినా ఏదోలే అనుకోవచ్చు. కానీ రివ్యూలు, పబ్లిక్ టాక్ అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. విడుదలకు ముందు నుంచే బజ్ విషయంలో బాగా వెనుకబడిన లాల్ సలామ్ నిర్మాణ సంస్థ లైకాని ముంచేదేమి లేదు కానీ రజని ఇమేజ్ పరంగా జరిగిన డ్యామేజ్ మాత్రం కొద్దిరోజులు వెంటాడుతూనే ఉంటుంది.
This post was last modified on February 10, 2024 12:51 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…