ఫిబ్రవరి 9 ఓటిటి లవర్స్ కి మాములు పండగలా లేదు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల హడావిడితో ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. కేవలం ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ లో ‘గుంటూరు కారం’ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి తేవడం థియేటర్ లో మిస్ చేసుకున్న ఆడియన్స్ కి కనువిందు చేయనుంది. ధనుష్ పీరియాడిక్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో డీసెంట్ గా ఆడినా తెలుగులో డిజాస్టర్ అయ్యింది. అలా అని మరీ బ్యాడ్ మూవీ కాదు కాబట్టి డిజిటల్ లో చూసే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రధాన భాషల్లో అందుబాటులోకి తేబోతున్నారు.
శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ సన్ నెక్స్ట్ లో వచ్చేస్తోంది. కేవలం తమిళంలో మాత్రమే ఉంటుందా లేక ఇక్కడ రిలీజ్ ఆలస్యమైన తెలుగు ఆడియో కూడా ఇస్తారా అనేది సస్పెన్స్ గానే ఉంది. స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ ‘బబుల్ గమ్’ని ఆహా తీసుకొస్తోంది. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి భూమి పెడ్నేకర్ ‘భక్షక్’ మీద మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ ఆకర్షణీయంగా అనిపించింది. మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం చేస్తున్న టాక్ షో ‘ఉస్తాద్’లో శర్వానంద్ గెస్ట్ గా వస్తున్నాడు. సుస్మిత సేన్ ‘ఆర్య సీజన్ 3’ని హాట్ స్టార్ పబ్లిక్ ముందు తీసుకొస్తుంది.
ఇక్కడ చెప్పినవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే. ఇలా చెప్పుకుంటూ ఇంకో పది దాకా వివిధ బాషల క్రేజీ మూవీస్ లిస్టులో ఉన్నాయి. థియేటర్లకు వందలు ఖర్చు పెట్టి ఏం వెళతాంలే అనుకునే వాళ్లకు కాలు కదపకుండానే ఇన్ని ఆప్షన్లు ఉంటే ఇక టికెట్లు కొని వెళ్లాలన్న ఉత్సాహం ఏమొస్తుంది. పైగా రవితేజ ఈగల్ కు తప్ప మిగిలిన థియేటర్ రిలీజుల మీద అంత ఆసక్తి కనిపించడం లేదు. లాల్ సలామ్, ట్రూ లవర్ పూర్తిగా టాక్ మీద ఆధారపడ్డాయి. యాత్ర 2 మొదటి భాగం రేంజ్ లో వెళ్లకపోవచ్చనే రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఇంట్లో కాలక్షేపానికి లోటు లేకుండా ఓటిటిలు చేసేస్తున్నాయి.
This post was last modified on February 9, 2024 9:59 am
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…