నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అతను ఎంచుకునే కథలు, దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి. గత ఏడాది శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊర మాస్ సినిమా తర్వాత.. శౌర్యువ్ అనే మరో డెబ్యూ డైరెక్టర్తో హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని. ప్రస్తుతం నాని.. ‘అంటే సుందరానికీ’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు.
ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్సుగానే ఉంది. శైలేష్ కొలనుతో ‘హిట్-3’తో పాటు సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి.
ఐతే ఈ సినిమాలో భవిష్యత్తులో ఉండొచ్చు కానీ.. వాటి కంటే ముందు నాని ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట. నాని-వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం. వేణు తాజాగా కథ నరేట్ చేయగా.. దాన్ని ‘సరిపోదా శనివారం’ తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట.
వేణుతో ‘బలగం’ తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. నానికి దిల్ రాజు బేనర్లో ‘ఎంసీఏ’ లాంటి పెద్ద హిట్ ఉంది. ‘బలగం’ ఫ్లూక్ హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 8, 2024 5:53 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…