నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అతను ఎంచుకునే కథలు, దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి. గత ఏడాది శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊర మాస్ సినిమా తర్వాత.. శౌర్యువ్ అనే మరో డెబ్యూ డైరెక్టర్తో హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని. ప్రస్తుతం నాని.. ‘అంటే సుందరానికీ’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు.
ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్సుగానే ఉంది. శైలేష్ కొలనుతో ‘హిట్-3’తో పాటు సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి.
ఐతే ఈ సినిమాలో భవిష్యత్తులో ఉండొచ్చు కానీ.. వాటి కంటే ముందు నాని ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట. నాని-వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం. వేణు తాజాగా కథ నరేట్ చేయగా.. దాన్ని ‘సరిపోదా శనివారం’ తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట.
వేణుతో ‘బలగం’ తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. నానికి దిల్ రాజు బేనర్లో ‘ఎంసీఏ’ లాంటి పెద్ద హిట్ ఉంది. ‘బలగం’ ఫ్లూక్ హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 8, 2024 5:53 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…