నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అతను ఎంచుకునే కథలు, దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి. గత ఏడాది శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊర మాస్ సినిమా తర్వాత.. శౌర్యువ్ అనే మరో డెబ్యూ డైరెక్టర్తో హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని. ప్రస్తుతం నాని.. ‘అంటే సుందరానికీ’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు.
ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్సుగానే ఉంది. శైలేష్ కొలనుతో ‘హిట్-3’తో పాటు సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి.
ఐతే ఈ సినిమాలో భవిష్యత్తులో ఉండొచ్చు కానీ.. వాటి కంటే ముందు నాని ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట. నాని-వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం. వేణు తాజాగా కథ నరేట్ చేయగా.. దాన్ని ‘సరిపోదా శనివారం’ తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట.
వేణుతో ‘బలగం’ తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. నానికి దిల్ రాజు బేనర్లో ‘ఎంసీఏ’ లాంటి పెద్ద హిట్ ఉంది. ‘బలగం’ ఫ్లూక్ హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.…
బాలీవుడ్ మీద గట్టి దృష్టి పెట్టిన రష్మిక మందన్న అక్కడి నుంచి వచ్చిన అవకాశాలను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు.…
పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన…
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…