బాలీవుడ్లోకి వెళ్లి ఎవరైనా సౌత్ డైరెక్టర్లు, నిర్మాతలు, ఆర్టిస్టులు సినిమాలు చేస్తే చాలా వరకు వినమ్రంగానే ఉంటారు. అక్కడి పద్ధతులకు తగ్గట్లు నడుచుకుంటూ సైలెంటుగా సినిమాలు చేసి వచ్చేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మను మినహాయిస్తే అక్కడ అగ్రెసివ్గా ఉన్న సౌత్ ఇండియన్ ఫిలిం సెలబ్రెటీలు కనిపించరు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం వర్మను మించి అగ్రెషన్ చూపిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తోనే తనేంటో రుజువు చేసిన సందీప్.. లేటెస్ట్గా ‘యానిమల్’ను పెను సంచలనమే రేపాడు. ఈ చిత్రం ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు సాధించింది. నటుడిగా, ఒక స్టార్గా రణబీర్ కపూర్ను ఎలా వాడుకోవాలో చూపిస్తూ అతడికి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సక్సెస్ ఇచ్చాడు సందీప్.
ఐతే ఈ సినిమాలో అనేక అంశాల మీద తీవ్ర వివాదాలు నడిచాయి. బాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలే చాలామంది ఈ సినిమా మీద విమర్శలు గుప్పించారు. జావెద్ అక్తర్ లాంటి లెజెండ్తో పాటు కిరణ్ రావు, కంగనా రనౌత్.. ఇలా చాలామంది సినిమాలోని విషయాలను తప్పుబట్టారు.
పురుషాధిక్యతను గ్లోరిఫై చేశారని.. మహిళల పాత్రలను కించపరిచేలా ప్రెజెంట్ చేశారని కంగనా లాంటి వాళ్లు సినిమాను విమర్శించారు. ఐతే వీళ్లందరికీ సందీప్ రెడ్డి దీటుగానే బదులిచ్చాడు. నీ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీసిన మీర్జాపూర్ సిరీస్లో సన్నివేశాల పరిస్థితి ఏంటి అంటూ జావెద్ అక్తర్కు ఇచ్చిన సమాధానం అయితే ఆయనకు దిమ్మదిరిగిపోయేలా చేసి ఉంటుంది. కంగనా రనౌత్ విషయంలో మాత్రం సందీప్ కొంచెం సున్నితంగానే స్పందించాడు. ఆమె తన సినిమాను విమర్శించినప్పటికీ.. తనకు తగ్గ పాత్ర ఉంటే ఆమెకు ఆఫర్ చేస్తానని అన్నాడు.
దీనికి కంగనా బదులిస్తూ.. సందీప్ సినిమాలో ఛాన్సిచ్చినా తాను నటించనని తేల్చి చెప్పేసింది. ‘‘సినిమాను విమర్శించడానికి, సమీక్షించడానికి తేడా ఉంది. యానిమల్ సినిమాపై నా రివ్యూను మీరు నవ్వుతూ చెప్పారు. అది మీకు నాపై ఉన్న గౌరవం అయి ఉండొచ్చు. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రా ఇవ్వకండి. అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్టులు అవుతారు. అది మీకే ప్రమాదకరం. ఫిలిం ఇండస్ట్రీకి మీరు కావాలి’’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది కంగనా.
This post was last modified on February 6, 2024 2:54 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…