కెజిఎఫ్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని టాక్సిక్ కు ఓకే చెప్పిన యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. గోవా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా మీద చాలా ఇంటెన్స్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని బెంగళూరు వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకున్నాడు. శరీరానికి కఠిన వ్యాయామం అందించి మేకోవర్ చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 10 విడుదల కానుంది.
ఇందులో ఒక ప్రధానమైన క్యామియో కోసం గీతూ మోహన్ దాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్. చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ కావాలంటే సూపర్ స్టార్ రేంజ్ హీరో అవసరమని, ఆ కారణంగానే బాద్షాని అడిగినట్టు ముంబై టాక్. అయితే షారుఖ్ అంత సుముఖత చూపించకపోవచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా తను గెస్టు రోల్స్ కి దూరంగా ఉంటున్నాడు. పఠాన్ లో చేసిన కారణంగానే సల్మాన్ ఖాన్ కోసం తిరిగి టైగర్ 3లో బదులు తీర్చాడు కానీ లేదంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాడు కాదు.
పైగా వరస హిట్లతో మంచి ఊపుమీదున్న టైంలో క్యామియోలు అనుమానమే. అయితే గీతూ మోహన్ దాస్ అడిగింది కాబట్టి ఆమె ట్రాక్ రికార్డు చూసి అయినా ఆలోచించడం జరగొచ్చు. టాక్సిక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ తర్వాత ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విలన్ పాత్రధారి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. సంజయ్ దత్ కాంబో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో పవర్ ఫుల్ స్టార్ ని వెతుక్కోవాలి. సరిగ్గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉంది కనక ప్రొడక్షన్ పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు
This post was last modified on February 5, 2024 8:54 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…