కెజిఎఫ్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని టాక్సిక్ కు ఓకే చెప్పిన యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. గోవా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా మీద చాలా ఇంటెన్స్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని బెంగళూరు వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకున్నాడు. శరీరానికి కఠిన వ్యాయామం అందించి మేకోవర్ చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 10 విడుదల కానుంది.
ఇందులో ఒక ప్రధానమైన క్యామియో కోసం గీతూ మోహన్ దాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్. చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ కావాలంటే సూపర్ స్టార్ రేంజ్ హీరో అవసరమని, ఆ కారణంగానే బాద్షాని అడిగినట్టు ముంబై టాక్. అయితే షారుఖ్ అంత సుముఖత చూపించకపోవచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా తను గెస్టు రోల్స్ కి దూరంగా ఉంటున్నాడు. పఠాన్ లో చేసిన కారణంగానే సల్మాన్ ఖాన్ కోసం తిరిగి టైగర్ 3లో బదులు తీర్చాడు కానీ లేదంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాడు కాదు.
పైగా వరస హిట్లతో మంచి ఊపుమీదున్న టైంలో క్యామియోలు అనుమానమే. అయితే గీతూ మోహన్ దాస్ అడిగింది కాబట్టి ఆమె ట్రాక్ రికార్డు చూసి అయినా ఆలోచించడం జరగొచ్చు. టాక్సిక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ తర్వాత ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విలన్ పాత్రధారి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. సంజయ్ దత్ కాంబో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో పవర్ ఫుల్ స్టార్ ని వెతుక్కోవాలి. సరిగ్గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉంది కనక ప్రొడక్షన్ పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు
This post was last modified on February 5, 2024 8:54 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…