తమిళనాట ఇప్పుడు సినిమాల పరంగానే కాక రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతున్న పేరు.. విజయ్దే. గత దశాబ్ద కాలంలో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతగానో పెంచుకుాడుని సూపర్ స్టార్ రజినీకాంత్ను కూడా వెనక్కి నెట్టి తమిళనాట నంబర్ వన్ స్టార్గా అవతరించాడు విజయ్. డీసెంట్ బిహేవియర్కు తోడు తక్కువ మాట్లాడడం, మాట్లాడినపుడల్లా మంచి మాటలు మాట్లాడడం, సినిమాల్లో మంచి సందేశాలు ఇవ్వడం ద్వారా అతను వ్యక్తిగతంగా కూడా జనాల్లో ఆదరణ పెంచుకున్నాడు.
జయలలిత మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి విజయ్ పార్టీ పెడతాడన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఇటీవలే ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని అనౌన్స్ చేశాడు విజయ్. దీంతో విజయ్ సినీ ప్రయాణానికి త్వరలోనే తెరపడబోతోంది.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇది అతడి 68వ సినిమా. దీని తర్వాత మరో చిత్రం చేసి సినిమాల నుంచి తప్పుకుంటానని.. తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతానని విజయ్ ప్రకటించాడు. చివరి సినిమా కచ్చితంగా రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుందని అందరికీ తెలుసు. మరి విజయ్ పొలిటికల్ ఐడియాలజీకి అద్దం పట్టే ఆ పవర్ ఫుల్ పొలిటికల్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముందు కార్తీక్ సుబ్బరాజ్ పేరు వినిపించింది కానీ.. తర్వాత విజయ్ ఆలోచన మారిందట.
లేటెస్ట్ సమాచారం ప్రకారం అజిత్తో వలిమై, తునివు సినిమాలు తీసిన హెచ్.వినోద్ను తన చివరి చిత్రానికి విజయ్ దర్శకుడిగా ఎంచుకున్నాడట. తొలి చిత్రం ‘శతురంగ వేట్టై’తోనే బలమైన ముద్ర వేశాడు వినోద్. తన రాజకీయ సలహాదారులను కూడా వినోద్ టీంలో చేర్చి మంచి పొలిటికల్ డ్రామాను తయారు చేయించే పనిలో విజయ్ ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on February 5, 2024 4:40 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…