Movie News

రెహమాన్ సాహసం భవిష్యత్తులో సమస్యే

సంగీత ప్రపంచంలో ఎవరూ చేయని ఒక సరికొత్త ప్రయోగానికి ఏఆర్ రెహమాన్ శ్రీకారం చుట్టడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. గతంలో ఆయన కంపోజింగ్ లో పాడి ఇతరత్రా కారణాల వల్ల కాలం చేసిన సాహుల్ హమీద్, బంబా బక్యా గొంతులను ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వాడి పునః సృష్టించి లాల్ సలామ్ సినిమా కోసం వాడుకున్నారు. దీని కోసం సదరు కుటుంబ సభ్యుల వద్ద అనుమతి తీసుకుని, తగిన పారితోషికం ముట్టజెప్పి మరీ ఈ ఎక్స్ పరిమెంట్ చేశారు. గతంలో వాళ్లిద్దరూ ఎన్నో సూపర్ హిట్ ట్రాక్స్ లో రెహమాన్ తో పాలు పంచుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.

భవిష్యత్తులో ఇదే తరహాలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారి గాత్రాన్ని కూడా విన్పించేలా చేయాలని ఉందని రెహమాన్ మనసులో మాటను వెలిబుచ్చడం మ్యూజిక్ లవర్స్ లో ఆందోళన రేకెత్తిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇలా స్వర్గస్తులైన గాయకుల గాత్రాలను ఆర్టిఫీషియల్ గా పుట్టిస్తూ పోతే వర్ధమాన సింగర్స్ కు అవకాశాలు ఎలా వస్తాయి. ఫ్యూచర్ జెనరేషన్ లో పిల్లలు ఏవి ఒరిజినలో ఏవి ఏఐ ద్వారా కంపోజ్ చేసినవో కనిపెట్టలేక ఒరిజినాలిటీకి దూరం కావొచ్చు. చూస్తుంటే ఘంటసాల, మహామ్మద్ రఫీ లాంటి లెజెండ్స్ ని కూడా ఈ రూపంలో పుట్టిస్తే ఊహించని షాకే అవుతుంది.

ప్రస్తుతానికి దీని గురించి మిశ్రమాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెహమాన్ ఈ ప్రయోగాన్ని ఇక్కడితో ఆపేసి కొత్త సింగర్స్ కు ఛాన్స్ ఇవ్వాలని కొందరు అంటుండగా, ఎలాగైనా సరే కీర్తిశేషులైన గొప్ప గాయనీ గాయకులను ఈ విధంగా అయినా వినే అదృష్టం దక్కుతుందని మరికొందరు అంటున్నారు. లాల్ సలామ్ కంటెంట్ కంటే ఇప్పుడీ పాటల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతూ ఉండటం విశేషం. పాతిక సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్ తెలుగులో సినిమాలు తగ్గించినా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

This post was last modified on February 5, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago