సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ సినిమా రిలీజవుతోందంటే.. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఉండే హడావుడే వేరు. కొన్ని రోజుల పాటు సౌత్ ఇండియా అంతటా సినిమా వాళ్ల చర్చలన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి. రజినీ ప్రత్యేక పాత్ర పోషించినా సరే.. ఆ హంగామా వేరుగా ఉంటుంది. కానీ ‘లాల్ సలాం’ అనే సినిమా విషయంలో జరుగుతున్నది చూస్తే షాకవ్వాల్సిందే.
‘జైలర్’ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాక రజినీ నుంచి వస్తున్న సినిమాకు కనీస స్థాయిలో కూడా హైప్ లేదు. అందులోనూ ఇది రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సినిమా. కాబట్టి రజినీకి దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కానీ ఈ చిత్రానికి తమిళనాట కూడా సరైన పబ్లిసిటీ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. సినిమా నుంచి ఇప్పటిదాకా ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నాలే జరగడం లేదు.
తమిళంలోనే హైప్ తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా.. తెలుగులో ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది సందేహమే. ఇప్పటిదాకా తెలుగు రిలీజ్ గురించి చిన్న ఊసు లేదు. ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలియదు. పోస్టర్లు కూడా వదలడం లేదు. ఈ రోజు సాయంత్రం ‘లాల్ సలాం’ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. అది ఎగ్జైటింగ్గా ఉండి, రజినీ పాత్ర విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగితే తప్ప.. ఈ శుక్రవారం ఓ మోస్తరుగా అయినా టికెట్లు తెగడం కష్టం.
చిత్ర బృందం ఉద్దేశపూర్వకంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోందా.. లేక సినిమా మీద నమ్మకం లేదా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఇందులో లీడ్ రోల్స్ చేసింది విష్ణు విశాల్, విక్రాంత్ అయినా.. జనం రజినీ సినిమాగానే చూస్తున్నారు. మరి రజినీ పాత్రకు సంబంధించిన మతలబు ఏంటో ట్రైలర్లో అయినా తెలుస్తుందేమో చూడాలి.
This post was last modified on February 5, 2024 2:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…