ఇంకో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగే సూచనలు స్పష్టంగా ఉండటంతో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇంకోవైపు వీటికి మద్దతుగా, వ్యతిరేకంగా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ కావడంతో ఈ చిత్రాల ప్రభావం జనాల మీద ఏ స్థాయిలో ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ కోర్టు కేసులో నలుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మోక్షం దక్కితే కానీ సీక్వెల్ ‘శపథం’ బయటికి రాదు. ఏపీ అపోజిషన్ ని ఉద్దేశపూర్వకంగా విమర్శించడానికి తీశారనే అభియోగాన్ని వర్మ ఎదురుకుంటున్నారు.
ఇంకో మూడు రోజుల్లో ‘యాత్ర 2’ వచ్చేస్తుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డికి మంచి ఎలివేషన్ ప్యాడ్ లా ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్ బిజినెస్, లాభాలు నష్టాల కన్నా జగన్ ఇమేజ్ ని పెంచడానికి పనికొస్తే చాలానే ఉద్దేశంతోనే ఇంత బడ్జెట్ పెట్టారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15 ‘రాజధాని ఫైల్స్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. అమరావతి రైతుల వ్యథలను ఆధారంగా చేసుకుని మూడు రాజధానుల అంశాన్ని స్పృశించిన విషయం ట్రైలర్ లో స్పష్టంగా అర్థమయ్యింది. పేర్లు నేరుగా చెప్పకపోయినా ఘాటు సెటైర్లు చాలానే ఉన్నాయి.
నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతినిధి 2’ సైతం పొలిటికల్ సిస్టమ్ ని ప్రశ్నించే ఉద్దేశంతో రూపొందుతున్నదే. వీటి ప్రభావం ఓటర్ల మీద ఇంత మోతాదులో ఉంటుందని కొలవలేం కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం వీటి వీడియోలు, సీన్లను ప్రచారాలకు వాడుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఓపెనింగ్స్, కలెక్షన్ల కన్నా తమ ఎజెండాను పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనే తాపత్రయమే ఈ దర్శక నిర్మాతల్లో కనిపిస్తోంది. ఏవి సక్సెస్ అవుతాయో ఏవి ఫెయిలవుతాయో చెప్పలేం కానీ మూవీ లవర్స్ మాత్రం తమకు పొలిటికల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తే చాలంటున్నారు.
This post was last modified on February 5, 2024 1:58 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…