స్టార్ క్యాస్టింగ్ లేకుండా చిన్న ఆర్టిస్టులతోనూ విజయాలు సాధించవచ్చని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందిలో తీసుకుంది ఇలాంటి వాళ్లనే . బ్లాక్ బస్టర్ కాకపోయినా మంచి సక్సెస్ అందుకుని అయిదేళ్ల తర్వాత కూడా కల్ట్ ఫాలోయింగ్ కొనసాగించింది. గత ఏడాది బలగం, రైటర్ పద్మభూషణ్ ఇదే ఋజువు చేశాయి. ఈ సూత్రాన్ని నమ్ముకుని మొన్న శుక్రవారం విపరీతమైన పోటీ మధ్య కిస్మత్ విడుదలయ్యింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో పాటు మరో ఏడు సినిమాలు రేసులో ఉన్నా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది.
బ్యాడ్ లక్ ఏంటంటే కిస్మత్ కి టైటిల్ లో ఉన్న విధిరాత ఫలితంలో కలిసి రాలేదు. క్రైమ్ కామెడీతో నవ్వించి థ్రిల్ చేయాలని చూసిన దర్శకుడు శ్రీనాథ్ బాదినేని సరైన కథా కథనాలు రాసుకోలేకపోయాడు. హైదరాబాద్ కు ఉద్యోగం కోసం వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళ (నరేష్ అగస్త్య – అభినవ్ గోమటం – విశ్వదేవ్ రాచకొండ)కు అనుకోకుండా ఒక లోకల్ డాన్ (అజయ్ ఘోష్) పోగొట్టుకున్న కోట్ల రూపాయల డబ్బుతో లింక్ ఏర్పడుతుంది. దాని కోసం వెతుకుతున్న అతని ముఠాని తప్పించుకుని వీళ్ళు చేసే సాహసమే కిస్మత్. పాయింట్ పరంగా కూడా మరీ కొత్తదనం ఏమీ లేదు.
ఎంగేజింగ్ అనిపించే సన్నివేశాలు లేకపోవడంతో పాటు వేగంగా ఉండాల్సిన స్క్రీన్ ప్లే ఊగుతూ సాగడం కిస్మత్ ఫ్లోని దెబ్బ కొట్టింది. ఎక్కడా ఆసక్తి కలిగించే సీన్లు లేకపోవడంతో తీసుకున్న పాయింట్ మరీ రొటీన్ అయిపోయింది. ఇలాంటివి గతంలో బోలెడు చూడటంతో నటీనటులు తమ ప్రతిభ మేరకు ఎంత బాగా నటించినా అవన్నీ తేలిపోయాయి. కేవలం ఆర్టిస్టుల మొహాలు చూసి ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు రారు. అదిరిపోయే కంటెంట్ ఉందనో, లేదా థ్రిలయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయనో తెలిస్తే తప్ప జనాలను రప్పించడం కష్టం. ఈ విషయంలో కిస్మత్ కి ఏదీ కలిసి రాలేదు.
This post was last modified on February 5, 2024 12:01 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…