Movie News

పత్తి రైతుల సమస్యలపై ఈగల్ యుద్ధం

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హైప్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈగల్. సంక్రాంతికే రావాల్సి ఉన్నా పోటీ తగ్గించడం కోసం వాయిదా వేసుకుని ఫిబ్రవరి 9 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. తాము ఎలాంటి ప్రయోగం చేయలేదని, పక్కా కమర్షియల్ మూవీగా అన్ని అంశాలు ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ హామీ ఇచ్చారు. అంతే కాదు ఈసారి నిరాశపరచబోమని రవితేజకు స్టేజి మీదే హామీ ఇచ్చారు. ట్రైలర్ చూశాక జనాలకు ఎక్కువగా యాక్షన్ కంటెంట్ ఉన్న చిత్రంగా అభిప్రాయం కలిగిన మాట వాస్తవం.

ఊహించని విధంగా అసలు కథ వేరే ఉంటుందట. దాని ప్రకారం ఇందులో రవితేజ పోషించిన ఈగల్ పాత్ర పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట. అలా అని ఏదో సందేశాలు, విప్లవాలు లాంటివి లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ జనాలు ఊగిపోయే ఎపిసోడ్స్ చాలానే పెట్టారని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వాటిని తీర్చిదిద్దిన విధానం షాక్ ఇస్తుందట. ప్రమోషన్లలో వాటిని ముందే చూపిస్తే థ్రిల్ తగ్గిపోతుంది కాబట్టి కావాలనే దాచి పెట్టినట్టు తెలిసింది. స్వయంగా రవితేజనే ఇందులో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తాడు.

చూస్తుంటే మాస్ మహారాజా ఈసారి సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నాడు. ధమాకా తర్వాత తనకు సోలో హిట్ పడలేదు. వాల్తేరు వీరయ్యలో పరిమిత పాత్ర కాబట్టి దాని క్రెడిట్ పూర్తిగా దక్కలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఈ ప్రభావం ఈగల్ బజ్ మీద పడటం వల్లే సోషల్ మీడియాలో ఇంకా ఫోకస్ దక్కలేదు. స్టార్ హీరోలు డ్రైగా భావించే ఫిబ్రవరి నెలను రిలీజ్ కు ఎంచుకున్న రవితేజకు మంచి ఫలితం దక్కాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తప్పనిసరి. లేదంటే పరీక్షల మూడ్ లో ఉన్న పిల్లలు, యువతను థియేటర్లకు వచ్చేలా చేయడం కష్టం. చూడాలి మరి.

This post was last modified on February 5, 2024 12:02 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

31 mins ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

4 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

5 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

5 hours ago