Movie News

ఆ సంస్థ నుంచి ఈ ఏడాది 15 సినిమాలు

ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా సరే.. ఏ రేంజిలో తీసినా, ఎంత ప్రణాళికతో పని చేసినా ఏడాదికి ఐదారుకు మించి సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. అలాంటిది ఒక సంస్థ నుంచి ఒక్క ఏడాదిలో 15 సినిమాల రిలీజ్ అంటే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఏడాది 15 సినిమాలు రాబోతున్నాయట. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాదే స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో ప్రస్తుతం 40 సినిమాలు మేకింగ్ దశలో ఉన్నట్లు ఆయన చెప్పడం విశేషం. వీలైనంత త్వరగా వంద సినిమాల మైలురాయిని అందుకోవాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘‘మేం నిర్మించిన సినిమాలు ఈ ఏడాది మొత్తం 15 విడుదలవుతాయి. అందులో ఒకట్రెండు ఓటీటీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సగటున నెలకొక సినిమా రిలీజ్ చేస్తాం. మా సంస్థలో ప్రస్తుతం 40 సినిమాల దాకా మేకింగ్ దశలో ఉన్నాయి. వేగంగా వంద సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాం. ఈటీవీ విన్ సంస్థతో కలిసి కొన్ని సినిమాలు తీస్తున్నాం’’ అని విశ్వప్రసాద్ తెలిపారు.

ప్రభాస్‌తో తాము తీస్తున్న ‘రాజా సాబ్’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నామని.. ఐతే దాని కోసం బెర్తు బుక్ చేయాల్సిన పని లేదని.. ప్రభాస్ సినిమా అంటే ఆటోమేటిగ్గా ఒక బెర్త్ ఉంటుందని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నెల 9న రిలీజవుతున్న తమ సినిమా ‘ఈగల్’ పెద్ద సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on February 4, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

45 minutes ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

6 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

7 hours ago

రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే…

8 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

8 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

8 hours ago