Movie News

రాధేశ్యామ్ దర్శకుడు.. మళ్లీ భారీగానే

‘జిల్’ అనే స్టైలిష్ యాక్షన్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ కుమార్. చంద్రశేఖర్ యేలేటి శిష్యరికం నుంచి వచ్చిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాలో బాగానే టాలెంట్ చూపించాడు. కాకపోతే ఓవర్ బడ్జెట్ వల్ల ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.

తొలి సినిమా కమర్షియల్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా దర్శకుడి ప్రతిభను గుర్తించి అతడితో సినిమా చేశాడు ప్రభాస్. వీరి కలయికలో రూపొందిన ‘రాధేశ్యామ్’ మీద నిర్మాతలు ఏకంగా 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రిజల్ట్ తేడా కొట్టింది. ఈ సినిమాకు కూడా ఓవర్ బడ్జెట్ పెద్ద సమస్యగా మారింది. ఐతే ఈ రిజల్ట్ తర్వాత రాధాకృష్ణ కొంచెం తగ్గి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ అతను మళ్లీ నిర్మాతలతో రిస్క్ చేయిస్తున్నట్లు సమాచారం.

రాధాకృష్ణ తన తొలి చిత్ర హీరో గోపీచంద్‌తో తన మూడో సినిమా చేయబోతున్నాడు. అతడి తొలి రెండు చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన యువి క్రియేషన్స్ సంస్థే మళ్లీ అతడికి ఛాన్స్ ఇస్తోంది. రాధాకృష్ణ-గోపీచంద్ కలయికలో ఈసారి రాబోయేది యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అట. ఈ చిత్రాన్ని దేశ విదేశాల్లోని భారీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట. మేజర్ పోర్షన్స్ విదేశాల్లోనే తీస్తారట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా ఏళ్లు అయిపోయింది. అతడి చివరి సినిమా ‘రామబాణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. త్వరలోనే అతను ‘భీమ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ అతనో సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలిసింది.

Satya

Recent Posts

రోడ్డు పక్కన నిలబడి ఆకర్షిస్తే.. ఏం జరుగుతుంది?

శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…

11 minutes ago

పుష్ప-3… నమ్మొచ్చా?

పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్‌గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…

2 hours ago

తెలంగాణలో అదనపు రేట్లు… ఇక కలేనా?

ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…

2 hours ago

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక…

3 hours ago

సమ్మతితో వేశ్యావృత్తి చేస్తే నో కేస్.. స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…

4 hours ago

బాల‌య్య చిన్న కూతురిలో ఇంత టాలెంటా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఘ‌న‌మైన వార‌స‌త్వం ఉన్న కుటుంబాల్లో నంద‌మూరి వారిది ముందు వ‌రుస‌లో ఉంటుంది. సీనియ‌ర్ ఎన్టీఆర్ లెగ‌సీని…

5 hours ago