Movie News

రాధేశ్యామ్ దర్శకుడు.. మళ్లీ భారీగానే

‘జిల్’ అనే స్టైలిష్ యాక్షన్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ కుమార్. చంద్రశేఖర్ యేలేటి శిష్యరికం నుంచి వచ్చిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాలో బాగానే టాలెంట్ చూపించాడు. కాకపోతే ఓవర్ బడ్జెట్ వల్ల ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.

తొలి సినిమా కమర్షియల్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా దర్శకుడి ప్రతిభను గుర్తించి అతడితో సినిమా చేశాడు ప్రభాస్. వీరి కలయికలో రూపొందిన ‘రాధేశ్యామ్’ మీద నిర్మాతలు ఏకంగా 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రిజల్ట్ తేడా కొట్టింది. ఈ సినిమాకు కూడా ఓవర్ బడ్జెట్ పెద్ద సమస్యగా మారింది. ఐతే ఈ రిజల్ట్ తర్వాత రాధాకృష్ణ కొంచెం తగ్గి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ అతను మళ్లీ నిర్మాతలతో రిస్క్ చేయిస్తున్నట్లు సమాచారం.

రాధాకృష్ణ తన తొలి చిత్ర హీరో గోపీచంద్‌తో తన మూడో సినిమా చేయబోతున్నాడు. అతడి తొలి రెండు చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన యువి క్రియేషన్స్ సంస్థే మళ్లీ అతడికి ఛాన్స్ ఇస్తోంది. రాధాకృష్ణ-గోపీచంద్ కలయికలో ఈసారి రాబోయేది యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అట. ఈ చిత్రాన్ని దేశ విదేశాల్లోని భారీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట. మేజర్ పోర్షన్స్ విదేశాల్లోనే తీస్తారట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా ఏళ్లు అయిపోయింది. అతడి చివరి సినిమా ‘రామబాణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. త్వరలోనే అతను ‘భీమ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ అతనో సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలిసింది.

This post was last modified on February 4, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

5 hours ago