గత కొన్నేళ్లలో సినిమాల పరంగా భాషలు, ప్రాంతాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీలు, పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని అన్ని భాషల వాళ్లూ అన్ని ఇండస్ట్రీల సినిమాలూ చూసేస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వేర్వేరు ఇండస్ట్రీలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతలు కూడా తమ పరిధిని విస్తరిస్తున్నారు.
ఓవైపు సొంత ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది కోలీవుడ్కు వెళ్లి ‘వారిసు’ సినిమాను అందించారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ఓ సినిమా తీస్తోంది. టాలీవుడ్లో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్యే కోలీవుడ్లో అడుగు పెట్టింది.
తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా.. తమిళంలోకి ఓ చిన్న సినిమాతో అడుగు పెట్టింది. ఆ సినిమానే.. వడక్కుపట్టి రామసామి. కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. కార్తీక్ యోగి దర్శకుడు. ఈ వీకెండ్లోనే ఈ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు కానీ.. కామెడీ ప్రియులను సినిమా బాగా ఆకట్టుకోవడంతో వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఆదివారానికి సినిమా సూపర్ హిట్ రేంజికి వెళ్లిపోయింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. పెద్ద సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. సంతానంకు కూడా చాన్నాళ్ల తర్వాత హీరోగా మంచి విజయం దక్కినట్లే కనిపిస్తోంది. తమిళంలో పీపుల్స్ మీడియా సంస్థకు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ పడింది.
This post was last modified on February 4, 2024 3:29 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…