మంచు ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది లక్ష్మీ ప్రసన్న. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె ముందు విలన్గా అరంగేట్రం చేసింది. ఆ చిత్రమే.. అనగనగా ఓ ధీరుడు. ఆ సినిమాలో మంచి లక్ష్మి చాలా బాగా నటించి నంది అవార్డు కూడా గెలుచుకుంది కానీ.. సినిమా ఆడకపోవడంతో నిరాశ తప్పలేదు.
ఆ తర్వాత గుండెల్లో గోదారి, దొంగాట సహా కొన్ని సినిమాల్లో మంచు లక్ష్మి లీడ్ రోల్స్ చేసింది కానీ.. ఏవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకోక తప్పలేదు. వైఫ్ ఆఫ్ రామ్ తర్వాత విరామం తీసుకుని.. రెండేళ్ల తర్వాత తన తండ్రి మోహన్ బాబు కలయికలో ఒక థ్రిల్లర్ మూవీని ప్రకటించింది మంచు లక్ష్మి. కానీ ఆ సినిమా ఏమైందో తెలియదు. ఆరంభమయ్యాక దాన్నుంచి ఏ అప్డేట్ లేదు. కాగా ఇప్పుడు మంచు లక్ష్మి కొత్త సినిమాను ప్రకటించింది.
ఆ సినిమానే.. ఆదిపర్వం. ఎర్రగుడి కథ అనేది ఈ సినిమా ఉప శీర్షిక. ఈ ట్యాగ్ లైన్కు తగ్గట్లే రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్తో పోస్టర్లు వదిలారు. మంచు లక్ష్మి భయానక అవతారాలతో వదిలిన పోస్టర్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. సంజీవ్ మెగోటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎమ్మెస్కే నిర్మాత.
ప్రొడక్షన్, టెక్నికల్ టీంలో అందరూ కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. పోస్టర్లు చూస్తే గ్రాండ్గానే కనిపిస్తున్నాయి. తొంభైవ దశకంలో ఇలాంటి దేవత-గుడి కథలు చాలా వచ్చేవి. ఆ తర్వాత ఆ ట్రెండుకు తెరపడింది. ఇప్పుడు మంచు లక్ష్మి తిరిగి ఆ జానర్లోకి అడుగు పెడుతోంది. మరి ఈ సినిమా అయినా మంచు వారమ్మాయికి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on February 3, 2024 10:13 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…