సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు సెలబ్రెటీలను ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. బూతులు తిడుతుంటారు. ఏకవచనంతో సంబోధిస్తుంటారు. చాలా క్యాజువల్గా కామెంట్లు పెట్టేస్తుంటారు. వీటిని చాలావరకు సెలబ్రెటీలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కొందరేమో రాంగ్ కామెంట్లకు దీటుగా బదులిస్తుంటారు. కొందరు మాత్రం కామెంట్లను స్పోర్టివ్గా తీసుకుంటూ ఉంటారు.
చాలా ఏళ్ల కిందట సిద్దార్థ్-షాలిని జంటగా ‘ఓయ్’ సినిమా తీసిన ఆనంద్ రంగా తన గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ఓయ్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. దానికి స్పందిస్తూ వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న ‘ఓయ్’ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆనంద్ రంగా.
ఈ పోస్టు కింద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావ్ రా’’ అని కామెంట్ పెట్టారు. దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చాడు ఆనంద్. దానికి ఆ నెటిజన్.. ‘‘మిమ్మల్ని గుండు అన్నందుకు సారీ’’ అని బదులిచ్చాడు. మళ్లీ ఆనంద్ స్పందిస్తూ.. ‘‘పర్వాలేదు. అది నిజమే కదా’’ అని కామెంట్ పెట్టడం విశేషం. ఒక దర్శకుడు ఇంత స్పోర్టివ్గా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఓయ్’ అనుకున్నంత బాగా ఆడకపోయినా.. దర్శకుడిగా ఆనంద్ రంగాకు మంచి పేరే తెచ్చింది. కానీ అతను తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ‘పొగ’ అని ఓ సినిమా.. ఇంకేదో మూవీ తీసినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య అతను ఓటీటీ కంటెంట్ మీద దృష్టిపెట్టాడు.
This post was last modified on February 2, 2024 5:19 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…