Movie News

దర్శకుడిని ‘ఒరేయ్ గుండు’ అంటే..

సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు సెలబ్రెటీలను ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. బూతులు తిడుతుంటారు. ఏకవచనంతో సంబోధిస్తుంటారు. చాలా క్యాజువల్‌గా కామెంట్లు పెట్టేస్తుంటారు. వీటిని చాలావరకు సెలబ్రెటీలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కొందరేమో రాంగ్ కామెంట్లకు దీటుగా బదులిస్తుంటారు. కొందరు మాత్రం కామెంట్లను స్పోర్టివ్‌గా తీసుకుంటూ ఉంటారు.

చాలా ఏళ్ల కిందట సిద్దార్థ్-షాలిని జంటగా ‘ఓయ్’ సినిమా తీసిన ఆనంద్ రంగా తన గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ఓయ్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. దానికి స్పందిస్తూ వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న ‘ఓయ్’ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆనంద్ రంగా.

ఈ పోస్టు కింద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావ్ రా’’ అని కామెంట్ పెట్టారు. దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చాడు ఆనంద్. దానికి ఆ నెటిజన్.. ‘‘మిమ్మల్ని గుండు అన్నందుకు సారీ’’ అని బదులిచ్చాడు. మళ్లీ ఆనంద్ స్పందిస్తూ.. ‘‘పర్వాలేదు. అది నిజమే కదా’’ అని కామెంట్ పెట్టడం విశేషం. ఒక దర్శకుడు ఇంత స్పోర్టివ్‌గా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఓయ్’ అనుకున్నంత బాగా ఆడకపోయినా.. దర్శకుడిగా ఆనంద్ రంగాకు మంచి పేరే తెచ్చింది. కానీ అతను తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ‘పొగ’ అని ఓ సినిమా.. ఇంకేదో మూవీ తీసినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య అతను ఓటీటీ కంటెంట్ మీద దృష్టిపెట్టాడు.

This post was last modified on February 2, 2024 5:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: Oye

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

1 hour ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

1 hour ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago