Movie News

మ్యారేజ్ బ్యాండ్‌లో సౌండంతా ఆమెదే

అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. తెలుగు ప్రేక్షకుల దృష్టిని విడుదలకు ముందు బాగానే ఆకర్షించిన కొత్త సినిమా. సుహాస్ అనే చిన్న నటుడు లీడ్ రోల్ చేసినప్పటికీ.. ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే అవన్నీ ఫుల్ అయిపోయాయి. వాటి నుంచి టాక్ కూడా బాగానే ఉంది. ఈ చిత్రంలో అందరు నటీనటులూ చక్కగా పెర్ఫామ్ చేశారు.

తెర మీద నటులను కాకుండా ఆయా పాత్రలను చూస్తున్నట్లే అనిపించింది. ఐతే సినిమాలో హీరో హీరోయిన్లు, విలన్ కంటే కూడా హైలైట్ అయింది హీరో అక్క పాత్ర. ఆ క్యారెక్టర్ చేసింది శరణ్య ప్రదీప్. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. ‘ఫిదా’లో సాయిపల్లవి అక్క పాత్రలో చేసిన అమ్మాయి అంటే.. ఎవరో తెలుస్తుంది.

‘ఫిదా’ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చాలానే చేసింది శరణ్య. అవి ఆమెకు ఓ మోస్తరు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఐతే తన కెరీర్‌ను మలుపు తిప్పే, తన స్థాయిని పెంచే పాత్ర మాత్రం ‘అంబాజీపేట మ్యారేజిబ్యాండు’లోనే దక్కింది. ఇందులో ఆమె చేసిన పద్మ పాత్ర బాగా పేలింది. హీరో సుహాస్ చేసిన పాత్ర, తన పెర్ఫామెన్స్ కొత్తగా ఏమీ అనిపించవు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్‌ల తరహాలోనే అమాయకంగా ఉంటుంది. కానీ ఆత్మాభిమానం కోసం పోరాడే పద్మ పాత్రలో శరణ్య చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.

సినిమాలో ఆమెకు హీరోను మించిన ఎలివేషన్ దక్కింది. కథ ప్రధానంగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. కొన్ని కీలకమైన ఎపిసోడ్లలో శరణ్య అద్భుతంగా నటించింది. సెకండాఫ్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లో అయితే తన పెర్ఫామెన్స్ మామూలుగా లేదు. ఆ సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోతాయి. శరణ్యలో ఇంత మంచి నటి ఉందా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సుంది.

This post was last modified on February 2, 2024 5:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య వస్తే మీకే మంచిది అంటున్న రాజా సాబ్ డైరెక్టర్

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

8 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

14 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

21 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

41 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

1 hour ago

అవేవీ లేకపోయినా మోగ్లీ’కి ఎ సర్టిఫికెట్

ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…

2 hours ago