ప్రముఖ మోడల్, సినీ నటి పూనమ్ పాండే హఠాన్మరణం పాలయ్యారు. కొంతకాలంగా గర్భాశయ(సర్వికల్) క్యాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ పాండే ఈ రోజు ఉదయం ఉత్తర ప్రదేశ్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనం పాండే పీఆర్ టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని పూనం పాండే టీం ఆమె ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
తామేంతో అభిమానించే పూనమ్ పాండే ఇక లేరని చెప్పేందుకు తాము ఎంతో బాధపడుతున్నామని ఆమె పీఆర్ టీం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తనను అభిమానించే ప్రతి వ్యక్తిని ప్రేమించే పూనమ్ పాండే ఇక లేరు అని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తాము గోప్యతను కోరుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
బాలీవుడ్, కన్నడ, తెలుగు, సినిమాలలో పూనమ్ పాండే నటించారు. కొన్ని టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు ఉంది. 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే తాను న్యూడ్ షో చేస్తానని పూనం పాండే చేసిన కామెంట్ తో ఆమె పేరు ఒక్కసారిగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. పూనమ్ పాండే మరణ వార్త తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.
This post was last modified on February 2, 2024 1:44 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…