‘బిగ్ బాస్’ తెలుగు వెర్షన్ కొత్త సీజన్ మొదలై ఒక్క రోజే అయింది. ఆ ఒక్క రోజులో జరిగింది పార్టిసిపెంట్ల పరిచయమే. ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. ఒక్కొక్క పార్టిసిపెంట్ను పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపడం మాత్రమే జరిగింది. లోపల వాళ్లకు ఇంకా పరిచయాలు కూడా జరిగినట్లు షోలో చూపించలేదు. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో ఒక పార్టిసిపెంట్కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోవడం.. ఆ వ్యక్తిని షో నుంచి బయటికి పంపించేయాలంటూ ఉద్యమం మొదలైపోవడం గమనార్హం. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా.. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి. గత ఏడాది టీవీ 9 నుంచి జాఫర్ ఈ షోలో పాల్గొన్నాడు. అతను ఏమంత ఆకట్టుకోలేదు. షోలో కొన్ని ఎసిసోడ్ల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఐతే సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే దేవి షోలో ఆరంభ వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందేమో అనిపిస్తోంది.
నిన్న రాత్రి న్యూస్ యాంకర్ దేవి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే.. #Eliminatedevinagavalli అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీని మీద వేలల్లో ట్వీట్లు పడిపోయాయి. దీని వెనుక ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందంటూ టీవీ9 మీద వాళ్లు విరుచుకుపడుతున్నారు కొంత కాలంగా. తాజాగా వ్యవహారం మరింత ముదిరింది. రెండు రోజులుగా ‘షేమ్ లెస్ టీవీ9’ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటిదాకా 5 లక్షలకు పైగా ట్వీట్లు పడటం గమనార్హం. సరిగ్గా టీవీ9 మీద జనసైనికుల ఆగ్రహం పతాక స్థాయిలో ఉన్న సమయంలోనే ఆ టీవీ ఛానెల్కు చెందిన దేవి బిగ్ బాస్లోకి వచ్చింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేయాలని.. అందుకోసం ఓటింగ్కు రెడీ అవ్వాలని జనసైనికుల్లోకి మెసేజ్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఎలిమినేషన్ కోసం ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఎలిమినేషన్ ప్రాసెస్లోకి దేవి వస్తే మాత్రం ఆమె బయటికి వెళ్లిపోవడం గ్యారెంటీ ఏమో.
This post was last modified on September 7, 2020 7:54 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…