‘బిగ్ బాస్’ తెలుగు వెర్షన్ కొత్త సీజన్ మొదలై ఒక్క రోజే అయింది. ఆ ఒక్క రోజులో జరిగింది పార్టిసిపెంట్ల పరిచయమే. ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. ఒక్కొక్క పార్టిసిపెంట్ను పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపడం మాత్రమే జరిగింది. లోపల వాళ్లకు ఇంకా పరిచయాలు కూడా జరిగినట్లు షోలో చూపించలేదు. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో ఒక పార్టిసిపెంట్కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోవడం.. ఆ వ్యక్తిని షో నుంచి బయటికి పంపించేయాలంటూ ఉద్యమం మొదలైపోవడం గమనార్హం. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా.. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి. గత ఏడాది టీవీ 9 నుంచి జాఫర్ ఈ షోలో పాల్గొన్నాడు. అతను ఏమంత ఆకట్టుకోలేదు. షోలో కొన్ని ఎసిసోడ్ల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఐతే సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే దేవి షోలో ఆరంభ వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందేమో అనిపిస్తోంది.
నిన్న రాత్రి న్యూస్ యాంకర్ దేవి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే.. #Eliminatedevinagavalli అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీని మీద వేలల్లో ట్వీట్లు పడిపోయాయి. దీని వెనుక ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందంటూ టీవీ9 మీద వాళ్లు విరుచుకుపడుతున్నారు కొంత కాలంగా. తాజాగా వ్యవహారం మరింత ముదిరింది. రెండు రోజులుగా ‘షేమ్ లెస్ టీవీ9’ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటిదాకా 5 లక్షలకు పైగా ట్వీట్లు పడటం గమనార్హం. సరిగ్గా టీవీ9 మీద జనసైనికుల ఆగ్రహం పతాక స్థాయిలో ఉన్న సమయంలోనే ఆ టీవీ ఛానెల్కు చెందిన దేవి బిగ్ బాస్లోకి వచ్చింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేయాలని.. అందుకోసం ఓటింగ్కు రెడీ అవ్వాలని జనసైనికుల్లోకి మెసేజ్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఎలిమినేషన్ కోసం ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఎలిమినేషన్ ప్రాసెస్లోకి దేవి వస్తే మాత్రం ఆమె బయటికి వెళ్లిపోవడం గ్యారెంటీ ఏమో.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…