Movie News

వాళ్ళ క్రేజు కరోనా పాలు!

ఏ చిన్న సినిమాకి అయినా ప్రేక్షకుల దృష్టిలో పడడం, వారి క్రేజ్ చూరగొనడం అన్నిటికంటే పెద్ద అఛీవ్మెంట్. చిన్న సినిమా కనుక ప్రేక్షకుల దృష్టిలో పడలేదంటే ఇక అది ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా గుర్తుంచుకోరు. అందుకే పబ్లిసిటీపై నిర్మాతలు చిన్న సినిమాలకి కూడా కోటి, రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు.

రెండు చిన్న సినిమాలకి మాత్రం అదనపు శ్రమ లేకుండా క్రేజ్ వచ్చింది. ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాలకు పాటల వల్ల కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ వచ్చింది. ఈ సినిమాలు అనుకున్న సమయంలో విడుదల అయి ఉంటే ఆ క్రేజ్ కి ఖచ్చితంగా మంచి వసూళ్లు తెచ్చుకుని ఉండేవి.

లాక్ డౌన్ వల్ల ఈ చిత్రాలు కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. అప్పుడెప్పుడో ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉంటుందనేది డౌటే. ఉప్పెన నిర్మాతలు వందల కోట్ల విలువైన సినిమాలు తీస్తుంటారు కనుక వాళ్ళు ఈ భారం తట్టుకోగలరు.

కానీ 30 రోజుల్లోపై అయిదు కోట్ల వరకు ఖర్చు పెట్టేసిన నిర్మాతకి మాత్రం ఇది పెను భారమే. ఓటిటీ నుంచి కూడా ఈ చిన్న సినిమాకు అంత రాదు కనుక ఎన్ని రోజుల్లో విడుదలవుతుందో అని ఎదురు చూస్తూ వడ్డీలు కట్టుకోక తప్పదు.

This post was last modified on April 26, 2020 4:32 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

39 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago