ఏ చిన్న సినిమాకి అయినా ప్రేక్షకుల దృష్టిలో పడడం, వారి క్రేజ్ చూరగొనడం అన్నిటికంటే పెద్ద అఛీవ్మెంట్. చిన్న సినిమా కనుక ప్రేక్షకుల దృష్టిలో పడలేదంటే ఇక అది ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా గుర్తుంచుకోరు. అందుకే పబ్లిసిటీపై నిర్మాతలు చిన్న సినిమాలకి కూడా కోటి, రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రెండు చిన్న సినిమాలకి మాత్రం అదనపు శ్రమ లేకుండా క్రేజ్ వచ్చింది. ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాలకు పాటల వల్ల కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ వచ్చింది. ఈ సినిమాలు అనుకున్న సమయంలో విడుదల అయి ఉంటే ఆ క్రేజ్ కి ఖచ్చితంగా మంచి వసూళ్లు తెచ్చుకుని ఉండేవి.
లాక్ డౌన్ వల్ల ఈ చిత్రాలు కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. అప్పుడెప్పుడో ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉంటుందనేది డౌటే. ఉప్పెన నిర్మాతలు వందల కోట్ల విలువైన సినిమాలు తీస్తుంటారు కనుక వాళ్ళు ఈ భారం తట్టుకోగలరు.
కానీ 30 రోజుల్లోపై అయిదు కోట్ల వరకు ఖర్చు పెట్టేసిన నిర్మాతకి మాత్రం ఇది పెను భారమే. ఓటిటీ నుంచి కూడా ఈ చిన్న సినిమాకు అంత రాదు కనుక ఎన్ని రోజుల్లో విడుదలవుతుందో అని ఎదురు చూస్తూ వడ్డీలు కట్టుకోక తప్పదు.
This post was last modified on April 26, 2020 4:32 pm
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…