శివ కార్తికేయన్ అనే తమిళ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ డాక్టర్, ప్రిన్స్, మహావీరుడు లాంటి సినిమాలతో అతను మన ప్రేక్షకులకు కూడా బాగానే చేరువ అయ్యాడు. తమిళంలో ఈ యువ కథానాయకుడి ఎదుగుదల సూపర్ సక్సెస్ స్టోరీ అనే చెప్పాలి. ముందుగా అతను వీడియో జాకీగా జనాలకు పరిచయం కావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ తరహా సహాయ పాత్రలు చేశాడు.
కోలీవుడ్లో అతడికి లిఫ్ట్ ఇచ్చింది స్టార్ హీరో ధనుష్. అతను హీరోగా చేసిన ‘3’లో పెద్దగా డైలాగ్స్ లేని ఫ్రెండు పాత్రలో నటించాడు శివ. ఆ తర్వాత అతణ్ని హీరోగా పెట్టి ధనుషే ‘ఎదిరి నీచిల్’ అనే సినిమా తీశాడు. అది పెద్ద సక్సెస్ అయింది. శివకు హీరోగా గుర్తింపు తెచ్చింది. ఆపై వరుసగా హిట్లు కొట్టి చూస్తుండగానే స్టార్ అయిపోయాడు శివ.
శివకార్తికేయన్ నటించిన రజినీ మురుగన్ లాంటి సినిమాలు సాధించిన వసూళ్లు చూసి కొన్నేళ్ల కిందటే ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయాడు. పెద్ద స్టార్గా ఎదిగినప్పటికీ ఒదిగి ఉంటూ.. మనలో ఒకడు అనిపించే క్యారెక్టర్లు చేయడం ద్వారా శివ తన ఇమేజ్ను ఇంకా ఇంకా పెంచుకుంటున్నాడు. విశేషం ఏంటంటే.. ధనుష్ ద్వారా సాయం పొంది హీరోగా నిలదొక్కుకున్న శివకార్తికేయన్.. ఇప్పుడు అతణ్నే మించిపోయాడు.
సంక్రాంతికి ధనుష్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా శివ సినిమా ‘అయలాన్’ బరిలో నిలిచింది. ముందు ధనుష్ సినిమాకే హైప్ కనిపించింది. ఓపెనింగ్స్లోనూ అది డామినేట్ చేసింది. కానీ రెండో రోజు నుంచి కథ మారింది. అయలాన్ వసూళ్లు అంతకంతకూ పెరిగాయి. కెప్టెన్ మిల్లర్ డౌన్ అయిపోయింది. రిలీజైన మూడు వారాలకు కూడా అయలాన్ మంచి వసూళ్లు సాధిస్తోంది. 100 కోట్లకు పైగా వసూళ్లతో శివ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అయలాన్. దాంతో పోలిస్తే కెప్టెన్ మిల్లర్ వసూళ్లు 60 శాతం కూడా లేవు. అయలాన్ గత వారం తెలుగులోనూ రిలీజ్ కావాల్సింది కానీ.. లీగల్ ఇష్యూస్ వల్ల తెలుగు రిలీజ్ ఆగిపోయింది.
This post was last modified on February 1, 2024 10:39 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…