ఇప్పుడు సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ చూసినా కుమారి పేరే మారుమ్రోగిపోతోంది. మొన్న ట్రాఫిక్ కి ఇబ్బందులు వస్తున్నాయనే కారణంగా హైదరాబాద్ పోలీసులు ఆమె వాహనాన్ని అనుమతించకపోవడం పెద్ద దుమారం రేపింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లిందంటే ఇష్యూ ఎంత దూరం చేరుకుందో వేరే చెప్పాలా. ఊరు పేరు భైరవకోన ప్రమోషన్లలో భాగంగా సందీప్ కకిషన్ తన టీమ్ తో సహా అక్కడికి వెళ్లడం, అందరూ మాములు కస్టమర్లలా రాపర్ ప్లేట్లలో అన్నం కూరలు పెట్టించుకున్న వీడియో బాగా వైరల్ అయ్యింది.
ఇంత జరిగాక జనాలు ఊరికే ఉంటారా. మైకులు పట్టుకుని యాంకర్లు ఆవిడతో ఇంటర్వ్యూలకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా కుమారి చెప్పిన మాటలు కొన్ని షాక్ కలిగించేలా ఉన్నాయి. నేరుగా అక్కడికి రాకపోయినా పార్సెల్స్ రూపంలో ఆమె కర్రీస్ తెప్పించుకున్న సినీ ప్రముఖులు ఉన్నారట. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. డ్రైవర్ ని ప్రత్యేకంగా పురమాయించి తెప్పించుకుని రుచి చూశాడట. అయితే నేరుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు కానీ వంటలకు పేరు పెట్టడానికి ఏముంటుంది. ఆలీ ప్రత్యక్షంగా వచ్చి తీసుకుని వెళ్లారట. ఇలా ఎందరో స్టార్లు వినియోగదారులుగా ఉన్నారట.
ఈ లెక్కన ఏ బోర్డు లేకుండా కుమారి వంటల వ్యాపారం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. సిఎం వస్తారని తెలిసినప్పటి నుంచి ఈ స్టాల్ కు జనాల తాకిడి ఇంకా ఎక్కువయ్యింది. యూట్యూబర్లు వెల్లువలా వచ్చి పడుతున్నారు. ఒక పక్క మాట్లాడుతూనే ఇంకో పక్క కూరలు వడ్డిస్తూ, ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ఉన్న కుమారి ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్ టా సెలబ్రిటీగా చెప్పుకోవచ్చు. లివర్ కి వెయ్యి రూపాయలు ఎక్స్ ట్రా పేరుతో ఒక మీమర్ సరదాగా సృష్టించిన వీడియో ఇంత రచ్చ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. టెక్నాలజీ మహత్యం అలాగే ఉంటుంది మరి.
This post was last modified on February 1, 2024 3:52 pm
ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే…
రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…
విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…
చిన్న సినిమాలకు రిలీజ్కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…