బాలీవుడ్ తెరంగేట్రానికి సాయిపల్లవి రెడీ అవుతోంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ రెండో సినిమాలో తనే జోడి అన్న విషయం నెలల క్రితమే బయటికి వచ్చింది. అఫీషియల్ గా చెప్పకపోవడంతో అభిమానుల్లో ఇంకా సందేహమే ఉంది. అయితే అలాంటి డౌట్ ఏమి అక్కర్లేదని ముంబై టాక్. జునైద్ నటించే డెబ్యూ మూవీ సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మించబోయే పీరియాడిక్ డ్రామా. దీనికి మహారాజ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. నిర్మాత ప్లస్ రచయితగా వ్యవహరిస్తున్న ఆదిత్య చోప్రా దర్శకత్వ బాధ్యతను సిద్దార్థ్ పి మల్హోత్రాకు ఇచ్చాడు. మన టాపిక్ రెండో మూవీ గురించి.
ఇటీవలే ముంబైలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జపాన్ వెళ్ళింది. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం చెల్లి పెళ్లి కోసం ఇండియాలోనే ఉన్న సాయిపల్లవి ఆ తతంగం పూర్తి చేసుకోవడంతో నాగ చైతన్య తండేల్ లో కొద్ది రోజులు పాల్గొని ఆ తర్వాత జపాన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అమీర్ ఖాన్ స్వయంగా చూసుకుంటున్నాడు. తన బ్యానర్ మీదే నిర్మిస్తున్నాడు. దర్శకుడు సునీల్ పాండే. జపాన్ లో ఇప్పటిదాకా ఎవరూ షూట్ చేయని సప్పోరో ప్రాంతంలో అనుమతులు సంపాదించారు.
ఇంత స్పెషల్ గా ఉంది కాబట్టే సాయిపల్లవి ఒప్పుకుని ఉండొచ్చు. ఆమెగా ఇంకా ఈ విషయాలు బయట పెట్టలేదు కాబట్టి వేచి చూడాలి. తన పాత్రకు పెర్ఫార్మన్స్ చేసే స్కోప్ ఉంటే ఒప్పుకోని ఈ ఫిదా పోరి చాలా గ్యాప్ తీసుకుని తండేల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇండో పాక్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతు లుక్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. సాయిపల్లవి పాత్రకు చాలా వెయిటేజ్ ఉంటుందని ముందు నుంచీ వినిపిస్తోంది. ఇవి కాకుండా శివ కార్తికేయన్ తో తమిళంలో ఒక సినిమా చేస్తున్న ఈ హైబ్రిడ్ పిల్ల కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు.
This post was last modified on January 31, 2024 7:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…