ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న ముచ్చటైనా సరే.. జాతీయ స్థాయిలో వార్తాంశంగా మారిపోతుంది. ‘బాహుబలి’ తర్వాత అతడి క్రేజ్ ఆ స్థాయికి చేరింది మరి. అతడి సినిమాల అప్ డేట్లను ఉత్తరాది ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ను డైరెక్ట్ చేస్తున్న రాధాకృష్ణ కుమార్.. ట్విట్టర్లో ప్రభాస్ అభిమానులను ఊరించే ట్వీట్ చేశాడు మొన్న.
కామెంట్ల రూపంలో ప్రభాస్ అభిమానులు తమ ప్రశ్నలను సంధించవచ్చని.. అందులో అత్యుత్తమమైన ఐదు ఎంచుకుని వాటికి ఆదివారం సమాధానం ఇస్తానని చెప్పాడు. అన్నట్లే ఆదివారం రాత్రి తనకు నచ్చిన ఐదు ప్రశ్నలు ఎంచుకుని వాటికి జవాబులిచ్చాడు. ఆ ప్రశ్నలేంటన్నది వెల్లడించలేదు కానీ.. అతనిచ్చిన ఐదు జవాబులేంటో చూద్దాం.
— అవును. మన డార్లింగ్ను డైరెక్ట్ చేయాలన్నది నా కల. సెట్లో అతడితో పని చేయడం అమితమైన సంతోషాన్నిచ్చింది.
— రాధేశ్యామ్ థియేటర్లలోనే, వచ్చే ఏడాది విడుదలవుతుంది.
— డార్లింగ్ లుక్స్ ‘రాధేశ్యామ్’కు అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తాయి.
— ‘రాధేశ్యామ్’కు పూజా హెగ్డేనే ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్.
— మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ వస్తాయి. కొంచెం ఓపికతో ఉండండి. సరైన సమయంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం.
వీటిలో అన్నిటికంటే అభిమానుల్ని మురిపించిన మాట.. ప్రభాస్ లుక్స్ సినిమాలో అదిరిపోతాయన్నదే. అలాగే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు సరైన సమయంలో విడుదలవుతాయని చెప్పడం ద్వారా.. వచ్చే నెల 23న ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదో ఒక కానుక ఉంటుందని చెప్పకనే చెప్పాడు రాధాకృష్ణ. మిగతా ముచ్చట్లన్నీ మామూలువే.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…