ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న ముచ్చటైనా సరే.. జాతీయ స్థాయిలో వార్తాంశంగా మారిపోతుంది. ‘బాహుబలి’ తర్వాత అతడి క్రేజ్ ఆ స్థాయికి చేరింది మరి. అతడి సినిమాల అప్ డేట్లను ఉత్తరాది ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ను డైరెక్ట్ చేస్తున్న రాధాకృష్ణ కుమార్.. ట్విట్టర్లో ప్రభాస్ అభిమానులను ఊరించే ట్వీట్ చేశాడు మొన్న.
కామెంట్ల రూపంలో ప్రభాస్ అభిమానులు తమ ప్రశ్నలను సంధించవచ్చని.. అందులో అత్యుత్తమమైన ఐదు ఎంచుకుని వాటికి ఆదివారం సమాధానం ఇస్తానని చెప్పాడు. అన్నట్లే ఆదివారం రాత్రి తనకు నచ్చిన ఐదు ప్రశ్నలు ఎంచుకుని వాటికి జవాబులిచ్చాడు. ఆ ప్రశ్నలేంటన్నది వెల్లడించలేదు కానీ.. అతనిచ్చిన ఐదు జవాబులేంటో చూద్దాం.
— అవును. మన డార్లింగ్ను డైరెక్ట్ చేయాలన్నది నా కల. సెట్లో అతడితో పని చేయడం అమితమైన సంతోషాన్నిచ్చింది.
— రాధేశ్యామ్ థియేటర్లలోనే, వచ్చే ఏడాది విడుదలవుతుంది.
— డార్లింగ్ లుక్స్ ‘రాధేశ్యామ్’కు అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తాయి.
— ‘రాధేశ్యామ్’కు పూజా హెగ్డేనే ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్.
— మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ వస్తాయి. కొంచెం ఓపికతో ఉండండి. సరైన సమయంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం.
వీటిలో అన్నిటికంటే అభిమానుల్ని మురిపించిన మాట.. ప్రభాస్ లుక్స్ సినిమాలో అదిరిపోతాయన్నదే. అలాగే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు సరైన సమయంలో విడుదలవుతాయని చెప్పడం ద్వారా.. వచ్చే నెల 23న ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదో ఒక కానుక ఉంటుందని చెప్పకనే చెప్పాడు రాధాకృష్ణ. మిగతా ముచ్చట్లన్నీ మామూలువే.
This post was last modified on September 7, 2020 1:56 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…