సినిమా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న చిత్రాల మేకర్స్ విడుదలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. గత ఏడాది బేబీ, సామజవరగమన, రైటర్ పద్మభూషణ్ లాంటి చిన్న చిత్రాలకు ప్రీమియర్స్ వేయడం బాగా కలిసి వచ్చింది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఇలా ప్రయత్నించి విఫలమైన చిత్రాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా మళ్లీ ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. అదే అంబాజీపేట మ్యారేజిబ్యాండు. సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజిబ్యాండు రిలీజ్ కావలసి ఉండగా.. అంతకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ప్రీమియర్స్ వేయబోతున్నారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ షోలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో ప్రీమియర్స్ మేలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. సుహాస్ సరసన శివాని నగరం నటించిన ఈ చిత్రంలో చాలా వరకు కొత్త, అప్ కమింగ్ ఆర్టిస్టులే ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు
This post was last modified on January 30, 2024 8:04 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…