సినిమా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న చిత్రాల మేకర్స్ విడుదలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. గత ఏడాది బేబీ, సామజవరగమన, రైటర్ పద్మభూషణ్ లాంటి చిన్న చిత్రాలకు ప్రీమియర్స్ వేయడం బాగా కలిసి వచ్చింది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఇలా ప్రయత్నించి విఫలమైన చిత్రాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా మళ్లీ ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. అదే అంబాజీపేట మ్యారేజిబ్యాండు. సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజిబ్యాండు రిలీజ్ కావలసి ఉండగా.. అంతకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ప్రీమియర్స్ వేయబోతున్నారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ షోలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో ప్రీమియర్స్ మేలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. సుహాస్ సరసన శివాని నగరం నటించిన ఈ చిత్రంలో చాలా వరకు కొత్త, అప్ కమింగ్ ఆర్టిస్టులే ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు
This post was last modified on January 30, 2024 8:04 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…