సినిమా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న చిత్రాల మేకర్స్ విడుదలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. గత ఏడాది బేబీ, సామజవరగమన, రైటర్ పద్మభూషణ్ లాంటి చిన్న చిత్రాలకు ప్రీమియర్స్ వేయడం బాగా కలిసి వచ్చింది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఇలా ప్రయత్నించి విఫలమైన చిత్రాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా మళ్లీ ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. అదే అంబాజీపేట మ్యారేజిబ్యాండు. సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజిబ్యాండు రిలీజ్ కావలసి ఉండగా.. అంతకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ప్రీమియర్స్ వేయబోతున్నారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ షోలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో ప్రీమియర్స్ మేలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. సుహాస్ సరసన శివాని నగరం నటించిన ఈ చిత్రంలో చాలా వరకు కొత్త, అప్ కమింగ్ ఆర్టిస్టులే ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…