సినిమా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న చిత్రాల మేకర్స్ విడుదలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. గత ఏడాది బేబీ, సామజవరగమన, రైటర్ పద్మభూషణ్ లాంటి చిన్న చిత్రాలకు ప్రీమియర్స్ వేయడం బాగా కలిసి వచ్చింది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఇలా ప్రయత్నించి విఫలమైన చిత్రాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా మళ్లీ ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. అదే అంబాజీపేట మ్యారేజిబ్యాండు. సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజిబ్యాండు రిలీజ్ కావలసి ఉండగా.. అంతకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ప్రీమియర్స్ వేయబోతున్నారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ షోలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో ప్రీమియర్స్ మేలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. సుహాస్ సరసన శివాని నగరం నటించిన ఈ చిత్రంలో చాలా వరకు కొత్త, అప్ కమింగ్ ఆర్టిస్టులే ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు
This post was last modified on January 30, 2024 8:04 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…