ఇది ఎవరు ఏ సందర్భంలో చెప్పినా ముమ్మాటికీ నిజం. ఈ సంవత్సరమే కాదు దశాబ్దాల చరిత్ర ఇదే ఋజువు చేస్తోంది. నాలుగైదు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని, థియేటర్లు దొరక్క కలెక్షన్లు తగ్గుతాయని ఎవరెన్ని చెప్పినా ఈ పండగ ఇచ్చినంత రెవెన్యూ వేరే ఈ సీజన్ ఇవ్వదు కాబట్టే ఇంతగా పోటీ పడతారు. 2024 మనకు తెలిసిపోయిన స్టోరీ కాబట్టి ర్యాండంగా కొన్ని పాత ఉదాహరణలు చూద్దాం. 1988లో మంచి దొంగ – రక్త తిలకం – ఇన్స్ పెక్టర్ ప్రతాప్ – కలియుగ కర్ణుడు తలపడితే చిరు, బాలయ్య, వెంకీ ముగ్గురు అగ్ర హీరోలు మంచి విజయం అందుకున్నారు.
1992లో చంటి – కిల్లర్ – రక్త తర్పణం – ప్రాణదాత పోటీ పడితే వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ సాధించడం అప్పట్లో రికార్డు. 1994లో ముగ్గురు మొనగాళ్లు – అంగరక్షకుడు – నెంబర్ వన్ ఢీ కొంటే ఫామ్ తగ్గిన సూపర్ స్టార్ కృష్ణ ఘనవిజయం అందుకున్నారు. పది రోజుల తర్వాత వచ్చిన గోవిందా గోవిందా సైతం ఫ్లాప్ మూటగట్టుకుంది. 2000లో అన్నయ్య – కలిసుందాం రా – వంశోద్ధారకుడు – సమ్మక్క సారక్క – పోస్ట్ మ్యాన్ మధ్య కాంపిటీషన్ లో విక్టరీ ఎవరిని వరించిందో చెప్పనక్కర్లేదు. 2002లో టక్కరి దొంగ – సీమ సింహం – బ్రహ్మచారితో తలపడి నువ్వు లేక నేను లేను సంచలన విజయం నమోదు చేసింది.
2005లో నా అల్లుడు – బాలు – ధన 51తో ఫైట్ చేసి సిద్దార్ట్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్లాక్ బస్టర్ కావడం ఎవరూ మర్చిపోలేరు. 2016లో నాన్నకు ప్రేమతో – డిక్టేటర్లను తట్టుకుని ఎక్స్ ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్నినాయనా హిట్లు కొట్టడం చిన్న విషయం కాదు. ఆపై సంవత్సరం ఖైదీ నెంబర్ 150 – గౌతమిపుత్ర శాతకర్ణిలకు ఎదురెళ్ళిన శతమానం భవతి వాటి సరసన గర్వంగా నిలవడం చరిత్ర. ఇలా లెక్కలేనన్ని ఉదంతాలు వెనక్కు తవ్వేకొద్దీ దొరుకుతూనే ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంక్రాంతి వార్ ఎప్పటికి ఆగిపోనీ ఆపలేని ఒక అంతులేని యుద్ధం.
This post was last modified on February 5, 2024 4:34 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…