సంక్రాంతికి తప్పుకోవడం వల్ల సోలో రిలీజ్ కోరుకున్న ఈగల్ మాట నెరవేర్చేందుకు ఫిబ్రవరి 9 నుంచి ఊరి పేరు భైరవకోన వాయిదా వేసుకోవడానికి అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఫిలిం చాంబర్ తరఫున ప్రెసిడెంట్ గా దిల్ రాజు ప్రకటించేశారు. కీలక సభ్యులతో ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన గతంలో మీటింగ్ జరిగినప్పుడు భైరవకోన ప్రస్తావన తమ దగ్గర రాలేదని, తర్వాత తెలుసుకుని సమర్పకులు అనిల్ సుంకర, నిర్మాత రాజేష్ ని అడిగాక వాళ్ళు ఒప్పుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సో రూట్ క్లియర్ అయ్యింది.
యాత్ర 2 రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి ఎన్నికల దృష్ట్యా దాన్ని పోస్ట్ పోన్ చేయలేని నిస్సహాయత వల్ల అది ఫిబ్రవరి 8న వస్తుందని స్పష్టం చేశారు. రజనీకాంత్ అతిధిపాత్ర పోషించిన లాల్ సలామ్ సైతం జనవరిలో పండగ వదులుకుని తొమ్మిదికి లాక్ చేసుకుందని, అయినా వాళ్ళు మాకు ఎక్కువ స్క్రీన్లు కావాలని డిమాండ్ చేయడం కనక లిమిటెడ్ రిలీజ్ తోనే అదీ వస్తుందని స్పష్టం చేశారు.సాంకేతికంగా ఈగల్ ఒక్కటే రావడం లేదనేది వాస్తవం. అయితే కాంపిటేషన్ కోణంలో చూసుకుంటే రవితేజకు పోటీ వచ్చే రేంజ్ లో జీవా, విష్ణు విశాల్ లు థ్రెట్ కారనేది నిజం.
మొత్తానికి నిర్మాతల మండలి చొరవ వల్ల ఇలాంటి క్లాష్ లు రాకుండా చూసుకోవడం మంచిదే. వచ్చే జనవరికి తాను ప్రెసిడెంట్ గా ఉండనని, అప్పుడు ఈ తరహా సమస్యలు చూసుకోవడానికి వేరొకరు ఉంటారు కాబట్టి తాను శతమానం భవతి నెక్స్ట్ పేజీ ప్రొడ్యూసర్ గా మాత్రమే కనిపిస్తానని దిల్ రాజు హింట్ ఇచ్చారు. ఊరి పేరు భైరవకోన కొత్త సమీకరణ ప్రకారం ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది. అయితే ఆపరేషన్ వాలెంటైన్ టాపిక్ రాలేదు. వరుణ్ తేజ్ ప్రమోషన్లైతే చేస్తూనే ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఈగల్ మీద భారీ నమ్మకంతో ఉన్నారు. ఈ వారం నుంచే పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నారు.
This post was last modified on January 29, 2024 6:48 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…