సంక్రాంతికి తప్పుకోవడం వల్ల సోలో రిలీజ్ కోరుకున్న ఈగల్ మాట నెరవేర్చేందుకు ఫిబ్రవరి 9 నుంచి ఊరి పేరు భైరవకోన వాయిదా వేసుకోవడానికి అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఫిలిం చాంబర్ తరఫున ప్రెసిడెంట్ గా దిల్ రాజు ప్రకటించేశారు. కీలక సభ్యులతో ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన గతంలో మీటింగ్ జరిగినప్పుడు భైరవకోన ప్రస్తావన తమ దగ్గర రాలేదని, తర్వాత తెలుసుకుని సమర్పకులు అనిల్ సుంకర, నిర్మాత రాజేష్ ని అడిగాక వాళ్ళు ఒప్పుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సో రూట్ క్లియర్ అయ్యింది.
యాత్ర 2 రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి ఎన్నికల దృష్ట్యా దాన్ని పోస్ట్ పోన్ చేయలేని నిస్సహాయత వల్ల అది ఫిబ్రవరి 8న వస్తుందని స్పష్టం చేశారు. రజనీకాంత్ అతిధిపాత్ర పోషించిన లాల్ సలామ్ సైతం జనవరిలో పండగ వదులుకుని తొమ్మిదికి లాక్ చేసుకుందని, అయినా వాళ్ళు మాకు ఎక్కువ స్క్రీన్లు కావాలని డిమాండ్ చేయడం కనక లిమిటెడ్ రిలీజ్ తోనే అదీ వస్తుందని స్పష్టం చేశారు.సాంకేతికంగా ఈగల్ ఒక్కటే రావడం లేదనేది వాస్తవం. అయితే కాంపిటేషన్ కోణంలో చూసుకుంటే రవితేజకు పోటీ వచ్చే రేంజ్ లో జీవా, విష్ణు విశాల్ లు థ్రెట్ కారనేది నిజం.
మొత్తానికి నిర్మాతల మండలి చొరవ వల్ల ఇలాంటి క్లాష్ లు రాకుండా చూసుకోవడం మంచిదే. వచ్చే జనవరికి తాను ప్రెసిడెంట్ గా ఉండనని, అప్పుడు ఈ తరహా సమస్యలు చూసుకోవడానికి వేరొకరు ఉంటారు కాబట్టి తాను శతమానం భవతి నెక్స్ట్ పేజీ ప్రొడ్యూసర్ గా మాత్రమే కనిపిస్తానని దిల్ రాజు హింట్ ఇచ్చారు. ఊరి పేరు భైరవకోన కొత్త సమీకరణ ప్రకారం ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది. అయితే ఆపరేషన్ వాలెంటైన్ టాపిక్ రాలేదు. వరుణ్ తేజ్ ప్రమోషన్లైతే చేస్తూనే ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఈగల్ మీద భారీ నమ్మకంతో ఉన్నారు. ఈ వారం నుంచే పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నారు.
This post was last modified on January 29, 2024 6:48 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…