దర్శకుడు కొరటాల శివ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన శ్రీమంతుడు రిలీజై ఎనిమిదేళ్లవుతున్నా దాని వివాదం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. 2015లో ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకు శరత్ చంద్ర అనే రచయిత స్వాతి పత్రికలో వచ్చిన తన కథను ఆధారంగా చేసుకునే చిత్రాన్ని తీశారని కేసు వేయడం అప్పట్లో సంచలనం రేపింది. విచారించిన నాంపల్లి కోర్టు రచయితల సంఘం సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని కాపీ నిజమేనని భావిస్తూ క్రిమినల్ చర్యలను ఎదురు కోవాలని ఆదేశించింది. దీని మీద కొరటాల శివ తర్వాత తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు.
అక్కడా చుక్కెదురు వచ్చింది. నాంపల్లి న్యాయస్థానం తీర్పుని హైకోర్టు సమర్ధించడంతో వ్యవహారం ఇంకాస్త ముదిరింది. దీంతో కొరటాల శివ ఏకంగా సుప్రీమ్ కోర్టుకి వెళ్లారు. శరత్ చంద్ర ఆలస్యంగా స్పందించారని, తమ వాదనను స్థానిక కోర్టులు వినలేదని శ్రీమంతుడు దర్శకుడి తరఫున వాదించిన నిరంజన్ రెడ్డి ఆర్గుమెంట్ ని ధర్మాసనం తిరస్కరించింది. దీంతో కేసుని డిస్మిస్ చేయాలా లేక మీరే వెనక్కు తీసుకుంటారా అని న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు వాపస్ కే కొరటాల మొగ్గు చూపడంతో బాల్ మళ్ళీ తెలంగాణ కోర్టుకి వచ్చి చేరింది. ఇప్పుడేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఈ ఇష్యూ జరిగినప్పుడు కొరటాల, సదరు రచయిత మ్యాటర్ సెటిల్ చేసుకున్నారనే టాక్ వినిపించింది కానీ అది నిజం కాదని తర్వాత తేలిపోయింది. శ్రీమంతుడులో ఊరిని ఒక ధనవంతుడి అబ్బాయి దత్త తీసుకుని అక్కడి సమస్యలను తీర్చడమనే పాయింట్ తనదేనని శరత్ చంద్ర ఆధారాలతో సహా సమర్పించడం ఈ కాంట్రావర్సీకి దారి చేసింది. కాపీ రైట్స్ వివాదాలు బయట పరిష్కరించుకోకపోతే అవి ఇలాగే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేవర షూటింగ్, రిలీజ్ వాయిదా, అనిరుద్ తో పని చేయించుకోవడం లాంటి ఒత్తిడిలో ఉన్న కొరటాల శివ దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో మరి.
This post was last modified on January 29, 2024 5:26 pm
జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.…
స్పెషల్ సాంగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా చాలా గ్యాప్ తర్వాత ఛాలెంజింగ్ రోల్ ఒకటి దక్కించుకుంది.…
గత గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్…
రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం,…
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న దురంధర్ మొదటి వారం తిరక్కుండానే నూటా యాభై…