Movie News

పాతికేళ్ల తర్వాత ఆ జోడీ మళ్లీ?

సినిమా కమర్షియల్‌గా అనుకున్నంతగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఒక మరపురాని జ్ఞాపకం. అందమైన ఆర్టిస్టులు.. దానికి తోడు అద్భుతమైన పెర్ఫామెన్స్.. క్లాసిక్ సాంగ్స్.. హృద్యమైన సన్నివేశాలతో ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అందులో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జోడీ అజిత్-టబులదే. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఇప్పుడు చూసినా మంచి ఫీల్ కలుగుతుంది.

ముఖ్యంగా ‘లేదని చెప్ప నిమిషము చాలు’ పాట అయితే ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో అంతగా అలరించిన ఈ జోడీ మళ్లీ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. ఐతే పాతికేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూడబోతున్నామన్నది కోలీవుడ్ తాజా సమాచారం. యువ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడు.

అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్.. గత ఏడాది విశాల్‌తో ‘మార్క్ ఆంటోనీ’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం కల్పించింది. అజిత్‌కు కథ చెప్పడం.. సినిమాకు ఓకే చెప్పడం ఆల్రెడీ జరిగిపోయాయి. కొన్నేళ్లుగా అజిత్ నడి వయస్కుడి పాత్రలే చేస్తున్నాడు. అందుకే తగ్గట్లే హీరోయిన్లనూ ఎంచుకుంటున్నాడు. ఆయన చివరి సినిమా ‘తునివు’లో కూడా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కథానాయికగా చేసింది.

ప్రస్తుతం అజిత్ నటిస్తున్న ‘విడా ముయర్చి’లో కూడా త్రిష హీరోయిన్. దీని తర్వాత ఆధిక్ దర్శకత్వంలో చేసే సినిమాలో టబుతో జోడీ కట్టబోతున్నాడట అజిత్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్ర చేయనుండగా.. ఎస్.జె.సూర్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

49 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

55 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago