Movie News

పాతికేళ్ల తర్వాత ఆ జోడీ మళ్లీ?

సినిమా కమర్షియల్‌గా అనుకున్నంతగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఒక మరపురాని జ్ఞాపకం. అందమైన ఆర్టిస్టులు.. దానికి తోడు అద్భుతమైన పెర్ఫామెన్స్.. క్లాసిక్ సాంగ్స్.. హృద్యమైన సన్నివేశాలతో ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అందులో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జోడీ అజిత్-టబులదే. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఇప్పుడు చూసినా మంచి ఫీల్ కలుగుతుంది.

ముఖ్యంగా ‘లేదని చెప్ప నిమిషము చాలు’ పాట అయితే ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో అంతగా అలరించిన ఈ జోడీ మళ్లీ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. ఐతే పాతికేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూడబోతున్నామన్నది కోలీవుడ్ తాజా సమాచారం. యువ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడు.

అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్.. గత ఏడాది విశాల్‌తో ‘మార్క్ ఆంటోనీ’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం కల్పించింది. అజిత్‌కు కథ చెప్పడం.. సినిమాకు ఓకే చెప్పడం ఆల్రెడీ జరిగిపోయాయి. కొన్నేళ్లుగా అజిత్ నడి వయస్కుడి పాత్రలే చేస్తున్నాడు. అందుకే తగ్గట్లే హీరోయిన్లనూ ఎంచుకుంటున్నాడు. ఆయన చివరి సినిమా ‘తునివు’లో కూడా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కథానాయికగా చేసింది.

ప్రస్తుతం అజిత్ నటిస్తున్న ‘విడా ముయర్చి’లో కూడా త్రిష హీరోయిన్. దీని తర్వాత ఆధిక్ దర్శకత్వంలో చేసే సినిమాలో టబుతో జోడీ కట్టబోతున్నాడట అజిత్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్ర చేయనుండగా.. ఎస్.జె.సూర్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.

This post was last modified on January 29, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Adhiktabu

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago