సినిమా కమర్షియల్గా అనుకున్నంతగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఒక మరపురాని జ్ఞాపకం. అందమైన ఆర్టిస్టులు.. దానికి తోడు అద్భుతమైన పెర్ఫామెన్స్.. క్లాసిక్ సాంగ్స్.. హృద్యమైన సన్నివేశాలతో ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అందులో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జోడీ అజిత్-టబులదే. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఇప్పుడు చూసినా మంచి ఫీల్ కలుగుతుంది.
ముఖ్యంగా ‘లేదని చెప్ప నిమిషము చాలు’ పాట అయితే ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో అంతగా అలరించిన ఈ జోడీ మళ్లీ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. ఐతే పాతికేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూడబోతున్నామన్నది కోలీవుడ్ తాజా సమాచారం. యువ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడు.
అజిత్కు వీరాభిమాని అయిన ఆధిక్.. గత ఏడాది విశాల్తో ‘మార్క్ ఆంటోనీ’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం కల్పించింది. అజిత్కు కథ చెప్పడం.. సినిమాకు ఓకే చెప్పడం ఆల్రెడీ జరిగిపోయాయి. కొన్నేళ్లుగా అజిత్ నడి వయస్కుడి పాత్రలే చేస్తున్నాడు. అందుకే తగ్గట్లే హీరోయిన్లనూ ఎంచుకుంటున్నాడు. ఆయన చివరి సినిమా ‘తునివు’లో కూడా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కథానాయికగా చేసింది.
ప్రస్తుతం అజిత్ నటిస్తున్న ‘విడా ముయర్చి’లో కూడా త్రిష హీరోయిన్. దీని తర్వాత ఆధిక్ దర్శకత్వంలో చేసే సినిమాలో టబుతో జోడీ కట్టబోతున్నాడట అజిత్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్ర చేయనుండగా.. ఎస్.జె.సూర్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోంది.
This post was last modified on January 29, 2024 4:28 pm
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…